సాయిబాబాకి ఎందరో భక్తులు .బాబా ద్వారకామాయిలో అసీనులై ఉన్నప్పుడు ,నిత్యం
ఎందరో అయనను దర్శిస్తుండేవారు .అది భక్తులకు బాబా యందు భక్తి .ఎవరి భక్తి వారిది .
ఒకరు వేరొకరి భక్తిని శంకించరాదు .
భక్తి విషయములో అంచనాలు వేయటం కుదరదు
ఒకరి భక్తిని చూసి సంతసించవలెను కానీ ,ఆ భక్తుని భక్తిలో లోపాలు చూడరాదు .
సాయబాబా భక్తులైన దంపతులు రఘునాద్ టెండుల్కర్ ,
సావిత్రీబాయి టెండుల్కర్ .వారు బాంబాయి నగర
పరిసరాలైన బాంద్రాలో నివసిస్తుండేవారు .వారి
ఇంట్లొ ఒక వకుళ పొగడపువ్వుల చెట్టు ఉండేది .ఆ చెట్టు రోజూ విపరీతంగా పుష్పాలు రాల్చేది .
సావిత్రీబాయి ప్రతీరోజూ ఉదయము ,
మధ్యాన్నం ,సంధ్యాసమయాలలో ఆ పుష్పాలు
ఏరి ఓపికగా వివిధ కొలతలతో మాలలు తయారు
చేసి ,వారింట్లోగల సాయినాధుని పటానికి ఆ మాలలు వేసి అలంకరించేది .అమెతో పాటూ ,ఆమె భర్త కూడా సాయబాబా భక్తుడే .
ఆమె బాబా పటానికి మాలలు వేసేటప్పుడల్లా
విమర్శించేవాడు .అయినా సావిత్రీబాయి తన సేవ
మానలేదు .కొంతకాలమైన తరువాత ఆ భార్యాభర్తలు షిర్డి వెళ్ళి బాబాను ద్వారకామాయిలో దర్శించుకున్నారు .
బాబా సావిత్రీబాయిని చూడగానే అక్కడ భక్తులతో "ఈ అమ్మ సావిత్రీబాయి నన్ను వకుళ పుష్పాలతో రోజూ ముంచెత్తింది .ఆ పుష్పాల
సువాసన మైకంలో సృహ కోల్పోయేను .
ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాను " అని పలికారు .
సావిత్రీబాయి భర్తకు అప్పుడు తన భార్య భక్తీ
ఎంతటిదో తెలిసింది .బాబా తనకు ,తన ఫొటొ కు
తేడాలేదని మనకి సాయిసచ్చరిత్ర ద్వారా తెలిపారు .కనుక బాబాకు ఎంత శ్రద్దతో పూజిస్తే
అంత దగ్గరై మనలను అనుగ్రహిస్తాడు. #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇


