విజయవాడ లో కొంత కాలం క్రితం నగరం మొత్తం పెద్దస్థాయిలో టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలా మందికి టైఫాయిడ్ వచ్చింది.
ప్రభుత్వం దీనికి కారణం ఏమిటని పరిశీలించి కనుగొన్న విషయం ఏమిటంటే పానీ పూరీ బళ్ళ దగ్గర నీరు కలుషితం అవ్వడం వలన టైఫాయిడ్ కేసులు పెరిగాయి.
దాంతో ప్రభుత్వం రంగం లోకి దిగి బళ్ళ దగ్గర పానీ పూరీ తినవద్దు అని ప్రచారం చేసారు. శుభ్రత లేకుండా పానీ పూరీ అమ్మే వారి పై చర్యలు తీసుకున్నారు.
ఇక్కడ పానీ పూరీ అమ్మేవారు పాపం పేదవారు అని కనికరం చూపలేదు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ప్రభుత్వం భావించింది.
ప్రస్తుతం కోవా బన్ను పై కల్తీ ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం కల్తీ కోవా బన్ను పై ఎటువంటి విచారణ లేకుండా కేవలం ఆ బన్నులు అమ్మేవాడు “ముస్లిం” అనే ఒకే ఒక్క కారణం తో అతనికి “పేదరికం” అనే ఒక రంగును అద్ది ప్రభుత్వ పెద్దలు కోవా బన్నులు అమ్మే “వలి” కి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. “వలి” ఇంటికి వరస పెట్టారు. అక్కడితో ఆగకుండా ప్రశ్నించిన వారిపై తిరిగి మాటల దాడి చేయడం మొదలుపెట్టారు.
దీనితో దొరికిందే అవకాశం అని హిందూ వ్యతిరేక శక్తులు కోవా బన్ను ఇష్యూలో “మొత్తం హిందూ సమాజాన్ని”, హిందుత్వ వాదులను టార్గెట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు అత్యుత్సాహం తో కల్తీ పై కనీసం ప్రాధమిక విచారణ లేకుండా పది రూపాయల కోవా బన్నును తామే స్వయంగా “ వలి “ ఇంటికి వచ్చి తింటామని పేర్కొని నాణ్యత సర్టిఫికెట్ లు ఇచ్చారు.
ఒక కల్తీ పధార్థం తిన్న వెంటేనే దాని ప్రభావం చూపక పోవచ్చు ! దాని ప్రభావం భవిష్యత్ లో అనేక రోగాలకు కారణం కావచ్చు. పైన పేర్కొన్న “టైఫాయిడ్” రోగం విజయవాడలో అలాగే వ్యాప్తి చెందింది. ప్రభుత్వం విచారణ చేసి కనుగొనే వరకు సామాన్య ప్రజలకు ఎవ్వరికీ తెలియలేదు.
ఈ బేసిక్ కామన్ సెన్స్ మర్చిపోయి సోషల్ మీడియాలో పథకం ప్రకారం వస్తున్న సింపతి పోస్టుల మాయలో పడి ప్రభుత్వ పెద్దలు తమ బాధ్యత మర్చిపోయారు.
కోవా బన్ను అనే పథార్థాన్ని కేవలం “వలి” ఒక్కడే అమ్మడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది మంది అమ్ముతున్నారు. ఇప్పుడు వారందరికీ “ నాణ్యత సర్టిఫికెట్లు “ లభించినట్లు అయ్యింది.
ఈ కోవా బన్ను అమ్మేది ఎక్కువగా ముస్లింలు అయితే కొని, తినేది మెజారిటీ హిందువులు. ఏ విధమైన నాణ్యత విచారణ లేకుండా ఈ ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు హిందువుల ఆరోగ్యాలను ప్రమాదంలో పడవేస్తున్నాయి.
కల్తీని నివారించాల్సిన ప్రభుత్వాలే ఆ కల్తీ ని ప్రోత్సహిస్తున్నట్లు అయ్యింది ఇప్పుడు.
ఘటన జరిగింది తెలంగాణ లో అయితే ఆంధ్రా నాయకులు గుడ్డలు చించుకుంటున్నారు…ఈ విడ్డూరానికి కారణం “ వలి “ ముస్లిం కావడం ఒక్కటే కారణం.
ఇక్కడ అసలు సమస్య “ వలి “ పేదవాడు కావడం కాదు వలి “ ముస్లిం “ కావడం.
ఈ విపరీతమైన మైనారిటీ బుజ్జగింపులను
హిందువులు గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు తప్పక బుద్ది చెబుతారు !
#😮హిస్టరీ అండ్ ఫాక్ట్స్👩🏫 #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #🏛️రాజకీయాలు #✋బీజేపీ🌷

