ShareChat
click to see wallet page
search
*అశ్వారావుపేటలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె* *08.03.2026 – ఆదివారం* అశ్వారావుపేటలో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే Jare Adinarayana గారు అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ (HPV) టీకా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా యుక్త వయస్సు బాలికలకు స్వయంగా టీకాలు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ఉండేందుకు హెచ్‌పీవీ టీకా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అశ్వారావుపేట మండలంలోని అనంతారం, ఆసుపాక, తిరుమలకుంట గ్రామాలలో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంలో అనంతారం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల మరియు పెద్దవాగు ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలను కూడా సందర్శించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా సామర్థ్యం, వసతి సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత దృష్టి పెట్టి బలహీనంగా ఉన్న విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత విద్యను సాధించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని, ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జూపల్లి శశికళ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు, మెడికల్ స్పెషల్ ఆఫీసర్ మౌనిక గారు, వినాయకపురం స్పెషల్ ఆఫీసర్ రాందాస్ గారు, సిహెచ్ఓ అమరావతి గారు, హెచ్‌వి దుర్గ గారు, హెచ్‌ఏలు గోపాల్ గారు, ప్రసాద్ గారు, సతీష్ గారు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - 5  _ 5  _ - ShareChat