ShareChat
click to see wallet page
search
పోక్సో కేసు విజయవంతం – అధికారులకు జిల్లా ఎస్పీ ప్రశంసలు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్, న్యాయశాఖ అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేత మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ నిర్వహించిన పోలీస్ మరియు న్యాయశాఖ అధికారులను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ గారు కేసు విజయవంతానికి కృషి చేసిన ప్రాసిక్యూటర్ జాన్, పోలీస్ లీగల్ అడ్వైజర్ విశ్వేశ్వర్, కోర్టు లైజన్ ఆఫీసర్ బాలకృష్ణ, ఏఎస్‌ఐ, కోర్టు డ్యూటీ అధికారులు ఎండి.రహీం PC-2769, కృష్ణ PC-366, శంకర్ PC-2194, అరవింద్ PC-164 లను తన ఛాంబర్‌కు పిలిచి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలలపై జరిగే నేరాల్లో నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా పోలీస్ శాఖ న్యాయశాఖతో సమన్వయంతో పని చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు అభినందనలకు అర్హులని తెలిపారు. మహిళలు మరియు బాలల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు మరియు డిసిఆర్బి డిఎస్పి రమణారెడ్డి గార్లు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - ShareChat