#🙏అమలకి ఏకాదశి పూజ..ఆరోగ్యం, సంపద, మోక్షం కలుగుతుంది #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి #అమలక ఏకాదశి
*అమలక ఏకాదశి సందర్భంగా...*
*ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి సందర్భంగా...*
*దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి*
ఆమలక ఏకాదశినే ధాత్రీ ఏకాదశి, అమృత ఏకాదశి అనే నామాంతరాలున్నాయి, ‘ఆమలక వృక్షే జనార్దన:’ టారు కనుక ఈ రోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది. ఈ రోజు ఏ దానం చేసినా అది అక్ష యమవుతుంది. కొన్ని సంప్రదాయాలవారు ఈ రోజున సంపదలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున ఆమె ఆ చెట్టులో ఉంటుందని భావిస్తారు. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, రాధ ఈ చెట్టు సమీపంలోనే నివసించారనేది ఒక కథ. కార్తిక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుంది. ఉసిరి కొమ్మతెచ్చి పూజ చేయడం, ఉసిరికాయ దీపాలు వత్తులు వెలిగించడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయ డం వంటి పలు రకాల క్రియలు చేస్తారు, మళ్ళీ ఉసిరి ప్రస్తావన కనబడేది పాల్గుణ మాసంలో. ఉసిరి ఎంతో ప్రశస్తమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇక చైత్ర మాసంలో కాసే ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔష థ గుణముంటుందని, వాటి కోసం ప్రత్యేకంగా వెతుకు తుం టామని ఒక వైద్య గ్రంథాన్ని ఉటంకిస్తూ ఒక ఆయు ర్వేద వైద్యుడు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే హోళీ ఉత్సవాలకు ప్రారంభ దినంగా భావిస్తారు. ఆంధ్ర ప్రాంతం లోని గోదావరీ తీర వాసులు దీనిని కోరుకొండ ఏకాదశిగా వ్యవహరిస్తారు.
ఈ రోజు #కోరుకొండలోని_నరసింహ_స్వామి ఆలయంలో విశేష పూజలు, తిరునాళ్ల జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో నుంచి జనం వస్తారు. అన్ని పండగ దినాలకూ సంబంధించి ఉన్నట్టే ఈ పర్వానికి సంబంధించి కథలు ఉన్నాయి. ఒకసారి చిత్ర కేతుడనేరాజు వేటకు వెళ్ళాడు, వేట తమకంలో దారి త ప్పాడు. అతను ఒక ప్రాంతానికి వెళ్లగానే రక రకాల ఆయు ధాలు ధరించిన రాక్షసులు అధిక సంఖ్యలో అతనిని చుట్టు ముట్టారు. వారితో యుద్ధంలోఅతను గాయపడకపోయినా అలసిపోయి స్పృహ తప్పాడు ఆ సమయంలో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో అతని శరీరం నుంచి వెలువడి రాక్ష సులనందరినీ హతమార్చింది. కొంతసేపటికి స్పృహలోకొ చ్చిన చిత్ర సేనుడు తనపై దాడికి వచ్చిన వారందరూ పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆకాశవా ణి అతనిని ఒక దివ్య శక్తి రక్షించిందని, దానికి కారణం అతను ఏకాదశి వ్రతాన్ని ఆచరించడమేనని పేర్కొంది. ఆ తర్వాత అతని రాజ్యంలో ఆ వ్రతం, దాని ఫలితం ప్రసిద్ధి పొందింది. ఎక్కువ మంది దానిని ఆచరించడంతో రాజ్యంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరిసాయి.
*దీనికి సంబంధించి వ్రత ఫలాప్ని చెప్పే మరో కథ:*
బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠుడు చెప్పినట్లుగా ఉందని విజ్ఞులు చెబుతారు. దాని ప్రకారం విదిష రాజ్య ప్రభువైన చిత్రరథుడు విష్ణు భక్తుడు. అతని రాజ్య ప్రజలు కూడా విష్ణు భక్తులే. ఒక ఏడాది అతను, కొంత మంది భక్తులతో ఒక నదీ తీరంలో ఉన్న ఒక ఆమలక వృక్షం వద్ద విష్ణు పూజ చేశాడు. దీనిలో భాగంగా రాజు పరశురామావతార విష్ణువును కూడా పూజించాడు. వారందరూ ఉపవాసం ఉండి రాత్రంతా విష్ణు భజనలు పాడుకుంటూ జాగరణం చేశారు.ఆ సమయంలో ఎటువంటి వేట దొరక్క ఉపవాసం ఉన్న ఒక వేటగాడు కూడా వారితో బాటు రాత్రంతా జాగారం చేశాడు. ఆ కారణంగా అతను మరు జన్మలో రాజుగా జన్మించారు. అతనికి వసురథుడని పేరు పెట్టారు. అతను కూడా వేట తమకంలో రాక్షసుల బారిన పడడం ఒక దివ్య శక్తి చేత రక్షించబడటం వంటివన్నీ జరిగాయని చెబుతారు. గత జన్మలో చేసిన ఆమలక ఏకా దశి ఫలితంగా అతనికి ఈ జన్మలోనూ రక్షణ లభించిందని చెబుతారు. ఏది ఏమైనా ఎటువంటి కోరిక లేకుండా పూర్తి భక్తితో ఈ రోజు విష్ణు పూజ చేస్తే పైన చెప్పిన విధం గా ఈ జన్మలోనూ, వచ్చే జన్మలోనూ విశేష ఫలితం ఉంటుందని చెప్పడం కథ ఉద్దేశం. ఈ రోజు చేసిన దానం వాజపయం, సోమయజ్ఞంలో చేసిన దానంతో సమానమని చెబుతారు. ఇక ఈ రోజున పూజించే ఆమలక వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నదనేది అందరికీ తెలిసిందే. దానికి ఎన్నో విశేష లక్షణాలు ఉన్నాయి. వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుందని, గొంతు నొప్పి, హృద్రోగాలు పిత్తాశయంలో రాళ్లు, అల్సర్లు, కామెర్లు, నెప్పులు, దురద లను, పేలను నివారిస్తుందని, జీవ క్రియలు వేగంగా జరి గేలా చేస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని జీర్ణ క్రియకు ఉపయోగించే పీచు పదార్థం దీనిలో ఎక్కు వని, మలబద్ధకాన్ని నివారిస్తుందని, రోగ నిరోధక శక్తిని పెం చుతుందని, కంటి చూపును మెరుగు పరుస్తుందని, రక్తాన్ని వృద్ధి చేస్తుందని, ఎముకలకు బలం చేకూరుస్తుం దని, శరీరాన్ని చల్లబరుస్తుందని, కేన్సర్ వచ్చే అవకశాలను త గ్గిస్తుం దని, లివర్ను కాపాడుతుందని, శరీరానికి కాంతిని ఇస్తుందని, జుట్టు నెరవడాన్ని అరికడుతుందని చెబుతారు. అం తేకాక తె ల్ల ప్లేగు అనే క్షయ వ్యాది రాకుండా ఇది కాపాడుతుందని కూడా ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాక ఈ పండులో షడ్రసాల్లో ఒక్కటి తప్ప అన్నీ ఉంటాయని చెబుతారు. లేని ఆ ఒక్క రసం ఉప్పు అని చెబుతారు.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*


