ShareChat
click to see wallet page
search
#🌍నా తెలంగాణ #కాళేశ్వరం #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr కేసీఆర్‌ పదేండ్ల పాలనలో సర్వోన్నతాభివృద్ధి సాధించిన తెలంగాణ! కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26లో నాడు కేసీఆర్ హయాంలో అమలు చేసిన వినూత్న పథకాలను, సాధించిన విజయాలను పలుచోట్ల ఉటంకించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంతో పాటు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల వ్యవసాయం, సాగునీరు, నాటి ఐటీ మంత్రి కేటీఆర్‌ దార్శనికత వల్ల ఐటీ, పరిశ్రమలు, స్టార్టప్‌ల వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ప్రశంసించింది. అలాగే రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టడిలోనూ మెరుగైన పనితీరును కనబరిచిందని పేర్కొంది. నాడు 2014లో 1.31 కోట్లుగా ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఈ అద్భుత ప్రగతికి కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకమని సర్వే ప్రశంసించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలు అన్నదాతకు అండగా నిలిచాయని పేర్కొంది. #KaleshwaramProject
కాళేశ్వరం - ShareChat