ShareChat
click to see wallet page
search
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷ఫిబ్రవరి 13🌷🌷* *"అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగిరించును" (సంఖ్యాకాండము 17:5)* కోరహు మరియు అతని సమూహము మోషేపై అసూయపడిరి. వారు 250 మందితో కూడి మోషే, అహరోనులకు విరోధముగా తిరుగుబాటు చేసిరి. దేవుడు వారిని ఎంతో తీవ్రముగా శిక్షించినను, ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషేకు విరోధముగా సణుగుటను ఆపలేదు (సంఖ్యా. 16:41) అందుచేతనే దేవుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్క కర్ర చొప్పున 12 కర్రలను తీసికొని ప్రత్యక్ష గుడారములో ఉంచుమని మోషేకు చెప్పెను. తరువాత ఆయన ఇట్లనెను, "నేను ఎవని ఏర్పరచుకొందునో వారి కర్ర చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను (సంఖ్యా. 17:5,7) మరుసటి దినమున వారికి ఆశ్చర్యము కలిగించినదేమనగా, అహరోను పేరుగల కర్ర చిగిర్చి, పుష్పించి, బాదము పండ్లు గలదాయెను. సాధారణముగా బాదము చెట్టు ఫలించుటకు చాలకాలము పట్టును. ఇక్కడ ఒక్క రాత్రి లోనే ఆ కర్ర చిగిర్చి, పుష్పించి, ఫలించెను. దీని ద్వారా అహరోను కర్ర ఇతర కఱ్ఱలవలె కనబడుచున్నను, చాలా బేధము ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు. ఇతర కర్రలలో లేని ఒక విధమైన జీవము ఆ కర్రలో కలదు. అది పరలోక జీవము. ఒక విత్తనమును భూమిలో నాటి, నీరు కట్టినప్పుడు, ఆ విత్తనంలో జీవము ఉండును గనుక అది పెరుగును. అయితే అహరోను కర్ర పూర్తిగా ఎండిపోయినదైనను అదే కర్ర పుష్పించి, ఫలించెను. దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు అదే శక్తి బయలు పరచబడినట్లు ఆదికాండము 1:11లో చదువుదుము, "దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. అక్కడ విత్తుట, దున్నుట, కూర్చుట లేదు. దేవుడు కేవలము పలుకగా వివిధ రకములైన చెట్లు కలిగెను. అది దేవుని మాట యొక్క శక్తి. మోషే , అహరోనులు సామాన్య ప్రజలైనను, దేవుడు వారిలో నూతన జీవమును ఉంచెను. దేవుని ఆత్మ వారి ద్వారా పనిచేయుచుండెను. మోషే ప్రభువుకు లోబడి, ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన వర్తమానమును ఇవ్వవలసి యున్నది. దేవుడు అతనికి ఏమైతే చెప్పెనో దానికి ఏమియు కలపకుండా అతడు చెప్పెను. అయితే కోరహు , అతని అనుచరులు అంతయు మోషే, తన స్వంత జ్ఞానముతో చెప్పుచున్నాడని తలంచిరి. మోషే, అహరోనులు ఇతరులవలెనే అదే మాటలు మాటలాడినను వారి మాటలలో జీవము గలదు. ప్రతి యొక్కరు వారిమాటలలో జీవము ప్రవహించుటను చూడగలరు. వారి ప్రతి మాటలోనూ శక్తి, అధికారము గలదు. అయితే వారు ఇశ్రాయేలీయుల సమాజ ప్రధానులు గనుక తాము కూడా మోషేవలె మాటలాడగలమని తలంచిరి. పుష్పించిన ఈ కర్ర ద్వారా దేవుడు వారు కేవలము ఎండిపోయిన కర్రల వంటి వారని వారికి చూపించెను. మోషే, అహరోనుల విషయమైతే వారిలో శక్తిగలదు. దేవుడు వారిని తన సేవకై ఏర్పరచుకొనెనని రుజువు చేసెను. *అనేకులు అధిక జ్ఞానమును సంపాదించుట ద్వారా ఈ లోకములో గొప్ప బోధకులుగా కాగలమని తలంచుదురు. వారిలో సంతోషము ఉండదు, మరియు శక్తి యుండదు. వారు ప్రభువైన యేసు క్రీస్తు నామమున బోధించి, ఎంతో జ్ఞానముతో ప్రసంగించవచ్చును. అయినను వారిలో కేవలము ఎండిపోయిన స్థితినే చూడగలము. మత్తయి 7:22, 23 లలో మనకు గంభీరమైన ఒక హెచ్చరిక గలదు, "ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా ? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను: అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును."* Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝