ShareChat
click to see wallet page
search
హనుమకొండ జిల్లా, హసన్పర్తి మండలం చింతగట్టు మునిపెల్లి శివారులోని బోడగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం గుట్టపై వెలిసింది. కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళతో స్వయంభుగా వెలిసింది. సర్వే నెం.439/1, ఎ57-19 గుంటల విస్తీర్ణంలో ఉంది. దీనిపై అక్రమ మైనింగ్ నిర్వహిస్తు గుట్టలను ద్వంసం చేస్తున్నారు. చుట్ట ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు భయాందోలనలో ఉన్నారు. బారీ పెలుడ్ల వలన ఇండ్లు బీటలు బారి పశువులకు కూడా గాయాలు అయినాయి. 2010 నుండి పలుమార్లు ఫిర్యాదుచేసిన 4 కలెక్టర్లు పర్యవేక్షించి కూడా మైనింగ్ మాఫియాను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. పర్యాటక ప్రాంతం చేస్తామని కూడా తెలిపినారు. 10 సంవత్సరాలుగా అక్రమ మైనింగ్ రాత్రి వేళల్లో అణుబాంబు విస్పోటనం వలె గుట్టను కనుమరుగు చేస్తున్నారు. దేవాలయం కూడా కనుమరుగు అయే పరిస్థితి ఉంది. కాకతీయ వారసత్వ సంపదను ద్వంసం చేస్తున్నారు. 7 కంపెనీలు అక్రమ మైనింగ్ చేస్తున్నాయి. బోడగుట్ట రామలింగేశ్వరస్వామి దేవాలయమని దేవాదాయ శాఖ కూడా అక్రమ మైనింగ్ నిలిపివేయాలని లీజులను రద్దు చేయాలని తెలిపినా కూడా చేయడం లేదు. కావున ఇట్టి 7 కంపెనీలు నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్పై విచారణ జరిపి లీజులను రద్దు చేసి బోడగుట్ట రామ లింగేశ్వరస్వామి కాపాడాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చీకటి రాజు గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. #షేర్ చాట్ బజార్👍
షేర్ చాట్ బజార్👍 - ShareChat