ShareChat
click to see wallet page
search
ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల బందోబస్తు పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.జానకి. మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా ఈ రోజు రెండవ సంవత్సరం (సెకండ్ ఇయర్) పరీక్ష నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో, మహబూబ్‌నగర్ టౌన్‌లోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు సందర్శించారు. జిల్లా ఎస్పీ గారు పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్ర పరిసర ప్రాంతాలలో 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడం, అనధికార వ్యక్తులు గుంపులుగా గుమికూడకుండా చర్యలు తీసుకోవడం, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై కఠిన నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష సమయాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సహకరించాలని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని, అపోహలు లేదా రూమర్లు నమ్మవద్దని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - Gடவை5 9தப95 Gov JuNIORESLLEGE (8ovs) ಉಬುತ್ಪಿರಲುುಲಂಯರಕಾರ Gடவை5 9தப95 Gov JuNIORESLLEGE (8ovs) ಉಬುತ್ಪಿರಲುುಲಂಯರಕಾರ - ShareChat