శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 2
మన మనస్సును ఎలా శుభ్రం చేసుకోవాలో మొదటి దోహాలో తెలుసుకున్నాం. మనస్సు నిర్మలమైన తర్వాత, మనం భగవంతుడి ముందు ఎంత వినయంగా ఉండాలో ఈ రెండవ దోహా మనకు నేర్పుతుంది.
దోహా - 2
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ |
బల బుద్ధి బిద్యా దేహు మోహి హరహు కలేస బికార్ ||
ప్రతిపదార్థం:
* బుద్ధిహీన తను జానికే: అజ్ఞానం వల్ల కలిగిన శరీరం తో,లేదా ఏమి తెలియని తనంతో
* సుమిరౌ పవన కుమార: వాయుపుత్రుడవైన ఓ హనుమా! నిన్ను స్మరిస్తున్నాను
* బల బుద్ధి బిద్యా దేహు మోహి: నాకు శారీరక బలాన్ని, బుద్ధి కుశలతను, జ్ఞానాన్ని (విద్యను) ప్రసాదించు
* హరహు కలేశ బికార: నాలోని కష్టాలను (క్లేశాలను), మానసిక లోపాలను (వికారాలను) తొలగించు.
విస్తృత ఆధ్యాత్మిక వివరణ:
1. శరణాగతి (Surrender):
తులసీదాసు గారు ఇక్కడ "బుద్ధిహీన తను " అన్నారు అంటే శరీరం రావడానికి కారణం అజ్ఞానమే కదా దాని వల్లనే దేహత్మ భావన, కర్మలు ఫలాలు జన్మలు. అలాంటి కర్మల వల్లే, అజ్ఞానం వల్లే శరీరం వస్తుంది అని తెలుసుకుని దాన్ని బాపుకోవడానికి నిన్ను స్తుతి చేస్తున్నాను అని చెప్తున్నాడు.
అలా స్తుతించడం వల్ల ఏం వస్తాయి ఇహ పర సుఖాలు, ఇక్కడ ఏమేం కావలో అవన్నీ లభించి మళ్ళీ దేహం లేకుండా మోక్షం కూడా వస్తుంది అని చెప్పారు.
తులసి దాసు గారు మహా పండితుడు కానీ భగవంతునీ ముందు"నాకు ఏమీ తెలియదు, అంతా నువ్వే చూసుకోవాలి" అని శరణు అన్నాడు.అలా హనుమంతుడికి మనల్ని మనం అప్పగించుకోవడమే అసలైన భక్తి. ఈ వినయమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.ఇది ఇందులో ఉన్న గొప్ప రహస్యం.
2. త్రిశక్తి - బల, బుద్ధి, విద్య:
జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడు అత్యవసరం:
* బల (Strength): కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, కష్టాలను తట్టుకునే మానసిక ధైర్యం. మానసికంగా దృఢంగా లేక శంఖ,భయం అనుమానం ఉన్నవాడు భగవత్ అనుగ్రహం పొందలేడు. అందుకే అవి తొలగించు, తొలగించి దృఢంగా భగవంతునీ పాదాల దగ్గర నిలబడే శక్తి ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. వీటితో పాటు ఈశ్వర అనుగ్రహం చేత వచ్చిన
* బుద్ధి (Wisdom): శక్తిని ఏ మార్గంలో వాడాలో తెలిసిన వివేకం. లభించి దాన్ని సరిగా వాడి.
* విద్య (Knowledge): జీవిత పరమార్థాన్ని తెలిపే జ్ఞానం. మోక్షం కూడా పొందేలా చేయు స్వామి అని ఇందులో ఉన్న రహస్యం.
హనుమంతుడు ఈ మూడింటికీ నిధి. అందుకే ఆయనను వేడుకుంటున్నాము.ఈ మూడు రావాలి అంటే కొన్ని అంతం కావాలి.అవే
3. క్లేశ వికారాల అంతం:
అవిద్య, అస్మిత,రాగం,ద్వేషం, అభినివేశం,ఇవి క్లేషాలు.
ఆరురకాలు..తరువాత వికారాలు పోగొట్టాలన్నాడు. 'షడ్భావ వికారః' వికారాలను పతంజలి యోగశాస్త్ర గ్రంథంలో చెప్పాడు - 1.ఉత్పత్తి, 2 స్థితి 3.పరిణామము 4 వృద్ధి, 5 క్షయము 6. నాశనము. ఇవి తొలగి పోతే మోక్షం లభిస్తుంది.
మన జీవనం బలంతో, విద్యతో, జ్ఞానంతో వెళుతూ ఉంటే... క్రమక్రమంగా క్లేశాలు, వికారాలు పోతాయి ముక్తి లభిస్తుంది ఇది లభించాలంటే ఆంజనేయ స్వామివారిని స్మరించాలని చెప్తున్నారు.
ముగింపు:
నేను గురువులను ఆశ్రయించి, గురుచరణరజము చేత నా మనస్సును శుద్ధి చేసుకుని, రామచంద్రమూర్తిని కీర్తిస్తాను. ఆ కీర్తన జీవుడు సాధించవలసిన నాలుగు పురుషార్ధాలను(ధర్మార్థకామమోక్షము) ఇస్తుంది అటుపై ఆంజనేయస్వామివారిని స్మరిస్తున్నాను. ఈ శరీరం అజ్ఞానంవల్ల వచ్చినా ఆయన స్మరణ వల్ల పవిత్రమౌతున్నది. అంతేకాకుండా ఆ స్మరణ మానసిక, శారీరక బలాన్ని ఇస్తూ బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ క్లేశాలను, వికారాలను పొగొడుతున్నది”.
హనుమాన్ చాలీసా ఎందుకు స్మరించాలో చెప్పి హనుమాన్ చాలీసా ప్రారంభం చేస్తున్నారు తులసి దాసు గారు. ఇవన్నీ తొలగి సరైన జ్ఞానం లభించేలా చేయమని హనుమను ప్రార్థన చేసుకుంటూ మనం కూడా భక్తి తో అధ్యయనం చేసుకుందాం...
...సశేషం #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్


