ShareChat
click to see wallet page
search
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. రూ.45 లక్షల ఎంపీపీ నిధులతో వసతుల ఏర్పాటుకు శంకుస్థాపన. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 23.02.2026. మైలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు గ్రామంలో రూ.20 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, చిలుకూరు గ్రామంలో రూ.25 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కృష్ణా నది పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నప్పటికీ దాములూరు గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇక్కడ రూ.20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. రానున్న వేసవి దృష్ట్యా కూడా ఇక్కడ పైపులైన్ నిర్మాణం అనివార్యమన్నారు. చిలుకూరు గ్రామంలో ప్రజల చిరకాల వాంఛ అయిన పక్కా డ్రైనేజ్ నిర్మాణానికి రూ.25లక్షలతో చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రధాన ధ్యేయంతో కృషి చేస్తునట్లు పేర్కొన్నారు. ఆయా పనులకు నిధులు మంజూరు చేసిన ఎంపీపీ పాలడుగు జ్యోత్న్స గారిని, పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat