ShareChat
click to see wallet page
search
పరమశివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు.. సర్వజీవులనూ ప్రేమించే భోళాశంకరుడు. ఈ విషయాన్ని ఓ భక్తుడు తన చేతలతో నిరూపించి, 'నిజమైన భక్తి'కి సరికొత్త అర్థం ఇచ్చాడు. శివలింగానికి పాలాభిషేకం చేసే క్రమంలో, ఆ పాలు మురికి కాలవలోకి వృథాగా పోకుండా ఒక గిన్నెలో సేకరించాడు. ఆ 'ప్రసాదాన్ని' బయట వేచి ఉన్న శునకానికి అందించి దాని ఆకలి తీర్చాడు. విగ్రహంలో దేవుడిని చూడటమే కాదు, ఆకలితో ఉన్న ప్రాణిలోనూ శివుడిని దర్శించిన ఆ భక్తుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు."మట్టిలోని శివుడికి అభిషేకం చేసి.. జీవమున్న శివుడికి ఆకలి తీర్చాడు. ఇలా చేస్తేనే కదా అభిషేకానికి అసలైన ఫలం దక్కేది!" అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆచారానికి మానవత్వం తోడైతే అది మోక్షమార్గానికి బాట అవుతుందని ఈ వైరల్ వీడియో చాటిచెబుతోంది. #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🕉️హరహర మహాదేవ🔱 #🙏🏻గురువారం భక్తి స్పెషల్
🙏ఓం నమః శివాయ🙏ૐ - ShareChat
00:17