*కోడంగల్లో శ్రీశ్రీశ్రీ మడెలేశ్వర స్వామి జయంతి ఘనంగా నిర్వహించిన రజక సంఘం నాయకులు*
➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
★ ప్రతి గృహంలో కులదైవం ఫోటో పూజా గదిలో ఉంచాలి
రజకుల కులదైవం శ్రీశ్రీశ్రీ మడెలేశ్వర స్వామి జయంతి కార్యక్రమం మొట్టమొదటి సారిగా కోడంగల్ పట్టణ కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు. *వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో* 30-1-2026 శుక్రవారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ *అశోక్*, జిల్లా అధ్యక్షురాలు పర్సాపూర్ *లక్ష్మీ* అధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ మడెలేశ్వర స్వామి జయంతి సందర్భంగా స్వామి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక* , అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు *అన్నారం సాయిలు*, జిల్లా ఉపాధ్యక్షులు *వెంకటయ్య , పర్సపూర్ లలిత*, బషీరాబాద్ మండల అధ్యక్షులు *మోహన్,గొటికె నాగేష్* .
ఈసందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పర్సాపూర్ *లక్ష్మీ* మాట్లాడుతూ స్వామి జయంతి రోజున ఊరూరా అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని , మడేల్ మాచయ్య జీవిత చరిత్ర ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. కులదైవం ఫోటోను కులస్తుల ఇంట్లో పూజగదిలో ఉంచి పూజలు చేయాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ *అశోక్* రజక కుల బంధువులను కోరారు. #🏛️రాజకీయాలు


