ముంబైకి చెందిన రూబల్ నాగీ అనే గవర్నమెంట్ టీచర్ దేశ వ్యాప్తంగా 800 స్కూల్స్ ప్రారంభించి, మురికివాడల పిల్లల కోసం పెయింటింగ్స్ ద్వారా పాఠాలు చెప్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2025’ దక్కింది. దుబాయ్లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు 10 లక్షల డాలర్ల (సుమారు రూ. 9 కోట్లు) నగదు బహుమతిని ప్రదానం చేశారు.
కేవలం పుస్తకాలతోనే కాకుండా, మురికివాడల్లోని గోడలపై రంగురంగుల చిత్రాలు వేసి, ఆ గోడలనే పాఠ్యపుస్తకాలుగా మార్చారు రూబల్ నాగీ. ఈ 'వాల్ పెయింటింగ్స్' ద్వారా పాఠాలను సులభంగా వివరిస్తూ, చదువుకు దూరమైన వేలాది మంది పిల్లలను తిరిగి పాఠశాలలకు వచ్చేలా చేశారు. "పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతే, పాఠశాలనే వారి దగ్గరకు తీసుకెళ్లాలి" అనే నినాదంతో ఆమె చేపట్టిన ఈ ప్రయోగం లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ పురస్కారం ద్వారా వచ్చిన నగదును కూడా నిరుపేదల ఉచిత వృత్తి విద్యా శిక్షణ కోసమే కేటాయిస్తానని ఆమె ప్రకటించడం విశేషం.
#TalRadioTelugu #GlobalTeacherPrize #RubalNagi #TeacherInspiration #EducationForAll #LearningThroughArt #WallAsClassroom #ChangeMakers #InspiringTeachers #SocialImpact #HopeThroughEducation #PositiveNews #IndiaInspires #GoodNews #TalRadio #TouchALifeFoundation#🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్


