ShareChat
click to see wallet page
search
అందరికీ నమస్కారం 🙏 ఈరోజు కొత్తూరులో మాజీ ప్రధాని,భారత రత్న అటల్ బీహారీ వాజపేయి గారి జయంతి ఉత్సవాలలో భాగంగా స్వర్గీయ అటల్ స్మృతి సమ్మేళన్ కార్యక్రమం..నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ సిరిపురం తేజేశ్వరరావు గారు హాజరయ్యారు... ముఖ్య వక్తలుగా బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి సలానా రాఘవగారు,బిజెపి పార్టీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షులు గౌరవ శ్రీమతి డాక్టర్ పైడి సింధూర గారు హాజరయ్యారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం స్థానిక బోర శ్రీరామ కళ్యాణమండపంలో పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల నాయకులు, కార్యకర్తలతో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న గ్రహీత గౌరవ శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి స్మృతి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారూ గౌ.శ్రీ. స్వర్గీయ అటల్ బీహార్ వాజపేయి గారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పిచటం తో కార్యక్రమాన్ని ప్రారంభించారు తరువాత ముఖ్య వక్తలు వారి ప్రసంగాన్ని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, ముఖ్య వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ అటల్ బిహారి వాజపేయి భారతదేశానికి అందించినటువంటి సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రతీ పల్లెలో, ప్రతీ ఇంటి పై, బిజెపి పార్టీ జెండా ఎగరవేయాలని, బిజెపి ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో 5 మండలాల అధ్యక్షులతో పాటు bjp జిల్లా కార్యదర్శి పనుకు సూర్యనారాయణ గారు హీరమండల మండల అధ్యక్షులు రెళ్ళ డిల్లేశ్వరరావు, నాయకులు,కార్యకర్తలు, యువతీ,యువకులు, ప్రజలు పాల్గొన్నారు. #BJP4IND #BJPAndhraPradesh #bjp4india
bjp4india - ShareChat
00:00