#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #పైడితల్లి అమ్మవారి జాతర శుభాకాంక్షలు #సింహాచలం #మా ఊరి గ్రామదేవత
శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ దిగువన గల ఉప ఆలయంలో వైభవంగా 'పరుస' ఉత్సవం
సింహాచలం: 17ఫిబ్రవరి 2026
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం అనుబంధ ఆలయమైన శ్రీ పైడితల్లి అమ్మవారి తీర్థం (పరుస) కార్యక్రమం ఈ నెల 19.02.2026 (గురువారం) న అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉత్సవానికి సంబంధించి భక్తుల సౌకర్యార్థం మరియు కార్యక్రమ విజయవంతం కోసం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, క్రమశిక్షణతో మరియు సంతృప్తికరంగా దర్శనం చేసుకునేలా క్యూ లైన్లు, తాగునీరు మరియు ఇతర మౌలిక వసతులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కావున, భక్తులందరూ ఈ పరుస కార్యక్రమంలో పాల్గొని, ఆలయ క్రమశిక్షణను పాటిస్తూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కోరారు.


