ShareChat
click to see wallet page
search
"అన్నంలో గుడ్డు పెట్టడం ఏమిటండీ చదివితే చదవమని చెప్పండి లేకపోతే వెళ్ళిపొమ్మని చెప్పండి" సార్! ఎంత ఈజీగా అనేశారు... ఈ దేశంలో ఈయనని "గురువుగారూ" అని పిలిచే జనాలు లక్షల్లో ఉన్నారు. అతని మాటని ఎంతో గౌరవంగా పాటించే జనం ఉన్నారు... వీళ్లలో సగానికి పైగా పిల్లలు చదివేది అలాంటి బడుల్లోనే... గరికపాటిగారూ... ఇది టూమచ్ బ్రో! మీకు అవగాహన లేదనీ, ఈ విషయం తెలియదనీ అనుకోను. అయినా! (ఈ విషయంలో) మిమ్మల్ని గుడ్డిగా సమర్థించే వాళ్లకైనా ఓ మాట చెప్పాలి కదా బ్రో! Article 21 — “Right to Life” అని మన రాజ్యంగంలో ఒకటి ఉంది. దీన్ని ఉటంకిస్తూ సుప్రీమ్‌కోర్ట్ చెప్పిన మాట కూడా ఉంది. అదేమిటంటే... “జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు. గౌరవంగా బ్రతకడం.” ఆరోగ్యం... పోషకాహారం... కనీస జీవన ప్రమాణాలూ అందులో భాగం. అంటే ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వటం, పిల్లలకి పౌష్టికాహారం అందించటం దానమో, దయో కాదు అది వాళ్ల హక్కు. ఆరోగ్యంగా జీవించే హక్కు. Right to Education Act అని ఇంకొకటి ఉంది.... విద్య అంటే కేవలం పుస్తకం కాదు బ్రో!పిల్లాడు క్లాస్‌లో కూర్చునే స్థితి కూడా. ఒక పక్క కడుపు కాలుతుంటే మధ్యాహ్న భోజనం లేకుండా విద్య హక్కు నెరవేరదు. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం ఒక చట్టబద్ధ హక్కు. ఇక్కడ “ఇవ్వొచ్చు” అనడం లేదు “ఇవ్వాలి” అంటోంది చట్టం. 2001లో Supreme Court of India ఒక కీలక ఆదేశం ఇచ్చింది: పిల్లలకు డ్రై రేషన్ కాదు వండిన భోజనం ఇవ్వాలి. ఈ తీర్పుతోనేMid-Day Meal Scheme దేశవ్యాప్తంగా ఒక బలమైన హక్కుగా మారింది. అంటే... ఇది రాజకీయ నిర్ణయం కాదు న్యాయవ్యవస్థ బలపరిచిన హక్కు. ఈ హక్కు అమల్లో కూడా కమీషన్లు మిగుల్చుకునే నికృష్టమైన పురుగులు పడుతున్నాయి. పిల్లల నోటి దగ్గరి ముద్దతో వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. ఆఖరికి పసివాళ్ల తిండిలో కూడా స్కాములు చేసే అతిదరిద్రపు జాతి ఇది. ఆ పసివాళ్లు ఖాళీ కడుపుతో స్కూల్‌కి వచ్చి బెంచ్ మీద తల వంచి కూర్చుంటే… అతనికి పాఠం అవసరమా? లేక అన్నమా? ఈ ప్రశ్నకు మన సమాజం ఇచ్చే సమాధానం మనుషులుగా మన స్థాయిని చెబుతుంది. ఇప్పుడు ఇంకో విషయం కూడా మాట్లాడుకుందాం... ఏటా మన దేశంలో... అంటే అదే మీరు చెబుతుంటారు కదా "మహోన్నత చరిత్ర, గొప్ప సంస్కృతీ, చెప్పుకోదగ్గ దేవతలూ పుట్టిన ఈ భారత దేశంలోనే... శిశుమరణాల రేటెంతో తెలుసా? 2021 లెక్కల ప్రకారమే దాదాపుగా 7 లక్షల మంది. అయితే మన దేశంలో "ఆకలి చావులు" అంటం నామోషీ కాబట్టి వాటిని హంగర్ డెత్స్‌గా నమోదు చేయరు. మొత్తం మరణాల్లో 70% వరకు పోషకాహార లోపమే మెయిన్ కారణంగా ఉంది. జనాభాలో 12% మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. పిల్లల్లో 32.9% stunted (height తగ్గింది) 18.7% wasted (weight తగ్గింది) ఇవన్నీ రాబోయే కాలంలో సంభవించబోయే మరణాలకి రిస్క్ ఫ్యాక్టర్లు. “భారతదేశంలో ఆకలి వల్ల ఎవరూ చనిపోవడం లేదు అని ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే, వాళ్లు ఆకలితో కాదు ఆకలి వల్ల వచ్చిన వ్యాధులతో చనిపోతున్నారు.” పొద్దున్నే చేయించే ప్రేయర్‌లో ఎందరు పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళో గుర్తుందా గరికపాటిగారూ? సారీ! మీకా అవకాశం ఉండి ఉండదు. ఉన్నా మీరు "చదువుకుంటే చదువుకోండి లేకుంటే వెళ్లిపోండి" అనే కేటగిరీలో ఉన్నారు కాబట్టి. పట్టించుకొని ఉండరు. అయ్యా! ఇక్కడ చదువుకోవటానికి ముందు ముద్ద అన్నం కోసం అలమటించే పిల్లలు ఉన్నారని అర్థమయ్యాక, ఆకలితో పిల్లలని ఉంచేశాక ఇంకా ఎందుకీ ప్రభుత్వాలూ, ఎందుకీ హక్కులూ, ఈ న్యాయ వ్యవస్థలూ... తగలెయ్యటానికా? మొత్తంగా కూల్చేస్తే సరిపోదా? లేదంటే మూడు పూటలా తిండి పెట్టగలవాళ్లకే ప్రవేశం అని ఇంకో చట్టం తేరాదా. మనిషిగా బతుకుతున్నందుకైనా కనీసం పిల్లలమీదైనా కాస్త బాధ్యతతో మాట్లాడండి... టీచర్ల మీద అదనపు బాధ్యతల విషయంలో అలా ఆవేదనతో మాట్లాడారూ అని కొందరంటున్నారు. ఏమాత్రం "బుద్ది అదే ఆయన చెప్పిన ఙ్ఞానం ఉన్నవాడు ప్రభుత్వానికి సూచన చేస్తాడు... ఆ పనులు చేయగల స్టాఫ్‌ని రిక్రూట్ చేయమని. ప్రభుత్వ ఖజానాలో డబ్బులేదు అని నీలిగే ముందు... వందల, వేల కోట్ల డబ్బు పొలిటీషియన్ల ఆస్తులుగా ఎలా మారుతోందో అడుగుతాడు. పిల్లల తిండి మీద ఏడవడు. NOTE: షేర్ చేయవద్దు... కాపీ పేస్ట్ చేయండి (కింద కమెంట్‌బాక్స్‌లో ఉన్న లింకులతో సహా) నా పేరు ఉన్నా లేకున్నా పరవాలేదు... Nareshkumar sufhi sir Facebook wall #😎ఆటిట్యూడ్ కోట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🙆 Feel Good Status
😎ఆటిట్యూడ్ కోట్స్ - ShareChat