ShareChat
click to see wallet page
search
#😃మంచి మాటలు శ్రీ విద్యా... బ్రహ్మ సూత్రములు బ్రహ్మ సూత్రాలలో అద్వైత పరంగా నిరాకారుడు నిర్గుణుడు పరబ్రహ్మ అని శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించారు. అయితే శ్రీ విద్య బ్రహ్మ సూత్రములలో ఆ పరబ్రహ్మ సాకారంలో త్రిపుర సుందరి. నిరాకారంలో పరాశక్తి. మరణానంతరము భక్తులకు బ్రహ్మ లోకంలో మహ దైశ్వర్యాన్ని ప్రసాదించేది త్రిపుర సుందరి. యిదేద్వైతము అర్హులైన జ్ణానులకు సాయుజ్యాన్ని ప్రసాదించేది పరాశక్తి. యిక్కడ జీవాత్మ, పరమాత్మలో లీనమవుతుంది. యిది అద్వైతము ఈ రకంగా పరబ్రహ్మకు సాకార, నిరాకారాలు ద్వైత,అద్వైతాలు రెండూ శ్రీ విద్యా బ్రహ్మ సూత్రములలో ప్రతిపాదించబడుతున్నాయి. నిరాకారుడు,నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అతడు గనుక ఒక రూపం పొందినట్లై తే అదే లలితఅమ్మ వారు సృష్టి ప్రారంభానికి ముందు నిరాకరంగా వున్న ఆ పరాశక్తి సృష్టి చేయాలనే సంకల్పంతో తనను తాను రెండుగా విభజించుకున్నది.వారే లలితా త్రిపుర సుందరి త్రిపుర సుందరులు శివా శివులు పరమేశ్వరీ,పరమేశ్వరులు.శివశక్తులు. అధాతో బ్రహ్మ జిజ్ణాస బ్రహ్మ మును గురించి తెలుసుకోవాలనే కోరిక వివేకాది సాధనా సంపత్తి సిద్ధించిన తరువాత కర్మ ఫలం అనిత్యము అశాశ్వతము మెాక్షము,నిత్యము పరబ్రహ్మయే సత్యము అను తెలిసింది కాబట్టి ముముక్షువు బ్రహ్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనకు వేద శాస్త్రములే ప్రమాణం ఈ జగత్తు అంతా మిధ్య అంటే యివాళ వుండేదిరేపు వుండనిది పుట్టిన ప్రతీ మనిషి గిట్టకమానదుజీవితం దుఃఖభూయిష్టం సంసారికి దుఃఖాల నుండి నివృత్తి కావాలి. యిది అందరూ కోరేదే అంటే మరణం వుండకూడదు. జననము లేకపోతే మరణం వుండదు. అందుకే జన్మ రాహిత్యం కావాలియిదే మెాక్షంమెాక్షం ఒక్కటే ఈ దుఃఖాలనుంచి రక్షించి మానవుడికి శాశ్వత ఆనందాన్ని యిస్తుంది. పరబ్రహ్మ సాక్షాత్కారమే మెాక్షము యిది జ్ణానము వల్లనే వస్తుంది. జ్ణానాదేవతు కైవల్యం కాబట్టి మెాక్ష సాధనమైన బ్రహ్మాన్ని ఆ పరాశక్తిని గురించి తెలుసుకోవాలి అందుకే ఈ బ్రహ్మ జిజ్ణాస అధాతో శ్రీ విద్యా నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అతడు గనుక ఒక రూపం ధరిస్తే అదే శ్రీ విద్యలో ప్రతిపాదించిన శివశక్తుల స్వరూపమైన లలితా త్రిపుర సుందరి, లేదా రాజరాజేశ్వరి అని స్థాపించటం కోసం శ్రీవిద్యను వివ రిస్తు న్నారు. సృష్టి ప్రారంభానికి ముందు జగత్తంతా శూన్యంగా వుండేది. ఆశూన్యాన్ని పరబ్రహ్మ తత్త్వం ఆక్రమించివున్నది.అంటే జగత్తంతా పరబ్రహ్మ తత్త్వమే అదే పరాశక్తి. చరాచరా జగత్తులో ప్రతీ జీవిని దేవతలను దానవులను కూడా ఆ పరాశక్తియే సృష్టించినది. అంతే కాదు సదాశివుణ్ణి సృష్టించినది కూడా ఆమె ప్రళయ కాలంలో త్రిమూర్తులు ,త్రిశక్తులు కూడా ఆమె సృష్టించినది. అంతే కాదు సదాశివుణ్ణి సృష్టించినది కూడా ఆమె ప్రళయ కాలంలో త్రిమూర్తులు ,త్రిశక్తులు సదాశివుడితో సహా ఆ పరాశక్తిలో లీనమై పోతారు,అప్పుడు మిగిలేది కేవలము పరాశక్తి మాత్రమే ఆ పరాశక్తియే పరబ్రహ్మ ఆమెను గురించి తెలుసుకోవడానికే బ్రహ్మ జిజ్ణాస. కేనో పనిషత్తు యింద్రుడు ఉమాదేవిని ప్రశ్నించాడు. అమ్మా దేవతలనందరినీ భయ భ్రాంతులతో ముంచి వేసిన ఆయక్షుడెవరు ఆతత్త్వము ఏమిటి ఆశక్తియే బ్రహ్మ అని ఉమాదేవి సమాధానము యిచ్చినదిఆ తరువాత యింద్రునితో ఓ దేవేంద్రా బ్రహ్మము వల్లనే కదా మీరు విజయం పొందినది మీ గొప్పదనానికి కారణము బ్రహ్మము మీ అల్ప బుద్ధి వలన యిప్పటి వరకు కను పించిన తత్త్వమే బ్రహ్మమని గుర్తించలేకపోయారు ఆ బ్రహ్మ తత్త్వమే మీ శరీరంలో శక్తిని వ్యాపింపచేస్తోంది దాని వల్లనే మీరంతా అసురులను సంహ రించగలిగారు.అంతేకాని యిదంతా మీ గొప్ప తనమని అహంకరించకండి అని చెప్పి అదృశ్యమై పోయింది. ముందు కనిపించినది పరబ్రహ్మతత్త్వముయిది నిరాకారము. తరువాత కనిపించినదిఉమాదేవి అంటే పరబ్రహ్మ నిరాకారము అదిగనుకఒకఆకారం పొందితే పరాశక్తి. ఆవిడే శ్రీ విద్యా స్వరూపిణీ పరాశక్తి అయిన లలితాంబికఆమెను తెలుసుకో వాలనేఈజిజ్ణాస ఆమె ను సగుణ రూపంగా అంటే లలితా పరమేశ్వరి పరాశక్తి మెాక్షాన్నిచ్చే దేవత ఆమెను గురించి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నము అదే బ్రహ్మ జిజ్ణాస శ్రీ విద్య అనేది ఆత్మ విద్యఅదే బ్రహ్మ విద్య అందులో షోడశీ మహా మంత్రము మెాక్ష కారకము ఆ మంత్రాధి దేవత సాక్షాత్తుపరబ్రహ్మ స్వరూపము ఆవిడే పరాశక్తి. శ్రీ విద్యలో సగుణ బ్రహ్మ అంటే లలితా త్రిపుర సుందరిని ఆరాధించే వారు పంచదశీ మహా మంత్రాన్ని మెక్ష వాదులు ,మహా షోడశీ ని ఉపాసిస్తారు ఆత్మ విద్యా స్వరూపమైన ఆ పరాశక్తిని గురించి తెలుసుకోవాలనేదే ఈ జిజ్ణాస సగుణంలో లలితా త్రిపుర సుందరి నిర్గుణంలో పరాశక్తి ఆవిడే మెాక్షాన్నిచ్చే పరబ్రహ్మ.. సర్వతోముఖీ
😃మంచి మాటలు - ShareChat