#అరుణాచలం మహాక్షేత్రం# #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏
💗✨ *గిరి ప్రదక్షిణ చేసేటపుడు గిరివలం మార్గం లో మీరు దర్శించ వలసిన 44 అతి శక్తి వంతమైన ఆలయాలు*
అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం అంటే కొండ అని పరమార్ధం. అలాగే ఆ ఎర్రని కొండ పాపములను హరింప చేస్తుంది. అణ్ణామలైగా కూడా పిలుచుకునే సకల పాప దోషాలను హరింపచేసే ఈ క్షేత్రంలో స్మరణ మాత్రంచేత పుణ్యం లభిస్తుంది.
ఈ అరుణాచల స్వామి తేజోలింగం, జ్యోతిర్లింగము అందుకే అగ్నిక్షేత్రమని కూడా కొనియాడతారు. 14 కి. మీ. గిరి ప్రదక్షిణ చేయడమంటే ముక్కంటి ప్రదక్షణే. వేదాలు, ఉపనిషత్తులలో కొండ అనగా పెద్ద కొండ శివుడని. ఆ మహేశ్వరుడని సెలవిస్తోంది. గిరిప్రదక్షిణ చేసేమార్గం లో 44 ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలుంటాయి అన్నీ దర్శించుకుని పెద్దాలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదిక్షిణ పూర్తైనట్టే... ఈ కొండకి తూర్పు వైపున అరుణాచలేశ్వరాలయం కన్నా ఈ కొండే అత్యంత మహా అద్భుత ఫలితాలని, ప్రశాంతతని పుణ్యాన్ని ఇస్తుంది భక్తులకి.
1. బ్రహ్మలింగం - గిరి ప్రదిక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇది...
2. ఇంద్ర లింగం - ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం దీనికి శుక్రుడు - సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్ కి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి..
3. అగ్నిలింగం - అగ్ని తీర్థం - అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి.. వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం కుడివైపు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కపకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడు
4. శేషాద్రి స్వామి - ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించారని చెబుతారు. అవధూత స్వరూపంలో భక్తులను అనుగ్రహించేవారు.
5. దక్షిణా మూర్తి - ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన ఆలయం... దాదాపు 1500 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది.
6. రమణాశ్రమం - ఇక్కడ రమణమహర్షి తల్లి సమాధి ఉంటుంది.. దానికి నమస్కరించుకుని రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి
7. మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు -పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడుందని భక్తుల విశ్వాసం
8.ద్రౌపది ఆలయం - ఇక్కడ నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది... జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయినవారికి మానసిక స్థైర్యాన్నిస్తుంది ఈ ఆలయం
9.యమలింగం యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
10. పృథ్విలింగం - అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి...
11. వాలమూరి గణపతి - తొండం కుడివైపు తిరిగిఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటేఅదృష్టం వరిస్తుంది
12. దూర్వాస ఆలయం - ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు - ఇక్కడున్న వేపచెట్టుకి పసుపుదారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని...రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.
13. కాట్టు శివాశ్రమం - అటవీ అధికారుల అధీనంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపైనుంచి దర్శనం చేసుకుని వెళిపోవచ్చు..
14. అప్పు నంది - పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఇది జలసంబంధ నంది... వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది ఈ నంది దర్శనం
15. తేయునంది - ఈ నందినుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది... బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు. అందుకే ఇక్కడి నుంచి బహ్మదేవుడిలా కనిపిస్తుంది గిరి
16. శోణ తీర్థం - ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు..రమణమహర్షి గిరిప్రదిక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది.. ఆ మహనీయుడు కూర్చోవడం వల్ల ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది...
17. నైరుతి లింగం - అష్ట లింగాల్లో నాలుగోది ఇది..రాక్షసరాజు నిరుతి ( నైరుతి దిక్కుకి అధిపతి) ప్రతిష్టించిన విగ్రహం ఇది. ఈ క్షేత్రానికి అధిపతి రాహువు..ఇక్కడ స్వామిని దర్శించుకుంటే రుషగ్రహబాధలు తొసగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్థాయి
18.నంది ముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరివైపు చూస్తే..నంది ముఖంలా కనిపిస్తుంది
19.ఎదిర్ నేర్ అన్నామలై - సరిగ్గా ఇది గిరికి వెనుకవైపు ఉంటుంది.. ఇక్కడి నుంచి గిరిని చూస్తే శవశక్తి దర్శనం అవుతుంది.. అంటే శివుడు ఓ కొండగా, శక్తి మరోకొండగా కనిపిస్తారు..
20. ఆకాశ నంది - పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది
21. పళని ఆండవార్ ఆలయం- కుమారస్వామి ఇక్కడ తపస్సుచేసి స్వయంభుగా వెలశాడని చెబుతారు..అందుకే ఈ ప్రదేశం అత్యంత పవర్ ఫుల్
22. రాజ రాజేశ్వరి ఆలయం - ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం..ఇక్కడి నుంచి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది...
23. సింహ తీర్థం, సింహ నంది - పంచభూత నందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సింహతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు... ఓ సారి ప్రయత్నించి చూడండి భక్తితో...
24. కన్నప్ప గుడి - ఇది కూడా అటవీశాఖ అధీనంలో ఉంది. రోడ్డుపైనుంచి నమస్కారం చేసుకోవడమే..
25. గౌతమ ఆశ్రమం - గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది
26. సూర్య లింగం - అరుణగిరిపైనుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది..
27. వరుణ లింగం - వరుణ
లింగానికి అధిదేవత శని... గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది
28. మాణిక్య వాచకర్ ఆలయం-
మాణిక్యవాచకర్ శివభక్తుడు.. ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు
29. ఆది అణ్ణామలై - బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట..
30. వాయులింగం ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది..ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు..
31. వాయు నంది- వాయునంది చాలా శక్తివంతమైనది
32. భగవాన్ బ్రిడ్జ్ - రమణ మహర్షి సేదతీరిన ప్రదేశం ఇది..
33. చంద్ర లింగం - చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది... దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్టనష్టాలు బాధలు తొలగిపోతాయి...
34. అధికార నంది - శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది అలా ను అన్నమాట.. నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి
35. అగస్త్య ఆశ్రమం - ఇక్కడి నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు.ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి
36. కుబేర లింగం - లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి.
37. ఇడుక్కు పిళ్లయార్ - చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల రెండు యంత్రాలు అమర్చారని...గిరిప్రదిక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం.
38. పంచముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇది
39. ఊసి లింగం - ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం..ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది..
40. పచ్చయ్యమ్మ గుడి - ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది...
41. ఈశాన్య లింగం, యజమాన నంది - ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.
42. షణ్ముఖ ఆలయం - ఇక్కడ స్వామివారు ఆరుముఖాల్లో దర్శనమిస్తాడు..
43. దుర్గాలయం, ఖడ్గ తీర్థం- ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెబుతారు
44. ప్రవాళ పర్వతం - గిరిప్రదిక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది..రమణమహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది . ఇదీ గిరిప్రదిక్షిణ చేసే విధానం
నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది
గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది .
*Arunachala siva ..* 🙏🪷


