*ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె పర్యటన*
15.03.2026 – ఆదివారం
పంచాయతీ సిబ్బందికి కాళ్లు కడిగి గౌరవం తెలిపిన *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ*
ములకలపల్లి మండలంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాపరాలపల్లి గ్రామంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన *ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.* ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం అదే గ్రామంలో *పర్సా తిరుమలయ్య, నల్లమోతు సత్యం గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ* కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే వి.కె రామవరం (కొత్తూరు) గ్రామంలో ఆంగోతు రోజా గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
తరువాత ములకలపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న *యూనిఫామ్లను ఎమ్మెల్యే గారు* పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ సిబ్బందికి గౌరవ సూచకంగా *ఎమ్మెల్యే గారు వారి కాళ్లు కడిగి సత్కరించడం అక్కడ ఉన్న వారిని విశేషంగా* ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడంలో పంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. వారి సేవలను సమాజం గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో *మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, నాయకులు బత్తుల అంజి, కారం సుధీర్,* సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్


