ప్రజలకు అందుబాటులో పోలీస్ శాఖ – జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్
ప్రజావాణి ద్వారా పోలీసులపై మరింత పెరిగిన ప్రజల విశ్వాసం
మహబూబ్నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు పాల్గొని ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, కుటుంబ వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను జిల్లా ఎస్పీ గారికి నేరుగా విన్నవించారు. ఎస్పీ గారు ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకున్నారు.
అనంతరం ఆయా పిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ముఖ్యమైన కేసుల విషయంలో సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రజల కోసమేనని, ఎవరి జోక్యం లేకుండా, భయభ్రాంతులు లేకుండా ప్రజలు తమ సమస్యలను వెల్లడించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరిగిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
#MahabubnagarPolice #📰 వార్తలు

