*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷ఫిబ్రవరి 23🌷🌷*
*“దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక.. కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము" ( హెబ్రీ. 4:14,16)*
హెబ్రీ పత్రిక 5 వ అధ్యాయములో మన ప్రభువైన యేసు క్రీస్తును మెల్కీసెదెకు క్రమము చొప్పున నాలుగంతల పరిచర్య గల పరలోక గొప్ప ప్రధాన యాజకునిగా చూచుదుము. మొదటిగా ఆయన మన హద్దుబాటులన్నిటి కొరకు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మన ఉత్తరవాది, "నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు" (1 యోహాను 2:1) కనికరముగల, నమ్మకమైన ప్రధాన యాజకుడుగా, ఆయన మన పక్షమున బతిమాలును. మనమందరము మన బలహీనత, బుద్ధిహీనతతో దేవుని దుఃఖపరచు పనులు చేయుదుము. మనము తప్పు చేయవలెనని కోరకపోయినను, శత్రువు మనలను శోధనలోనికి ఈడ్చును. ప్రభువైన యేసు క్రీస్తు మన బలహీనతలు, పతనములను ఎరుగును గనుక మన పక్షముగా బతిమాలుచు, విజ్ఞాపన చేయును.
రెండవదిగా, పాత నిబంధన కాలములో ప్రధాన యాజకుడు ప్రజల పక్షముగా దేవునికి బలులు అర్పించవలసి యున్నది. ఈ అర్పణలు అయిదు విధానములలో యేసు ప్రభువును సూచించుచున్నవి. *మొదటిగా, దహన బలి- ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ బలిని గురించి మాట్లాడుచున్నది. రెండవదిగా పాపపరిహారార్థ బలి - ఏ రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు మన రక్షకుడగు నిమిత్తము మన పాపములన్నిటిని తాను భరించెనో మనకు జ్ఞాపకము చేయుచున్నది. మూడవదిగా, సమాధానబలి - ప్రభువైన యేసు క్రీస్తు మన సమాధానమై దేవునితో మనలను సమాధాన పరచుటను చూపుచున్నది. నాల్గవదిగా, అపరాధ పరిహారార్థ బలి - తిరిగి జన్మించిన పిమ్మట కూడా మనము చేయు పాపములను శుద్ధీకరించి, క్షమించుటకు ప్రభువైన యేసు క్రీస్తు మనకొరకు చేసిన సంపూర్ణ సదుపాయమును మనకు జ్ఞాపకము చేయుచున్నది. ఐదవదిగా, నైవేద్యబలి - మన ఆకలిని, దాహమును తీర్చుటకు ప్రభువైన యేసు క్రీస్తు మన ఆహారము, పానమునాయెనని చూపుచున్నది. ప్రభువైన యేసు క్రీస్తు మన పక్షముగా ఈ ఐదు బల్యర్పణలుగా నయ్యెను.* ఒక్క సంపూర్ణ బలి ద్వారా ఆయన మనలను నీతి మంతులనుగా చేసెను. మనము విశ్వాసము ద్వారా ఈలాగున చెప్పుచుండవలెను. "ప్రభువా, నీవే నా దహన బలి, నీవే నా సమాధాన బలి, నీవే నా పాప పరిహారార్థబలి, నీవే నా అపరాధ పరిహారార్థబలి , నీవే నా నైవేద్యబలి".
మూడవదిగా, ప్రధాన యాజకుడు ఎవరు దేవుని చిత్తమును కనుగొనవలెనని కోరుదురో వారికి సహాయము చేయును. అతని రొమ్ము మీది న్యాయవిధాన పతకములో ఊరీము, తుమ్మీము అను రెండు రాళ్లు ఉండును. ఈ రెండు రాళ్ళ ద్వారా అతడు దేవుని చిత్తమును కనుగొనును. ఈ రెండు ప్రశస్తమైన రాళ్లు ఏలాగున పనిచేయునో ఎవరును ఎరుగరు గాని వీటి సహాయము ద్వారా ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలిసికొనును (1 సమూ. 23: 9-12). ప్రభువైన యేసు క్రీస్తే మనలో నివసించుచున్న మన గొప్ప పరలోక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝

