సమాజం లో అవసరం అని వినిపిస్తే మేమేమి చేయగలం అని ఆలోచించే వారు ఎందరో. అటువంటి మంచి వారి గురించి తెలుసుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. మా TALRadio సోషల్ మీడియా పేజెస్ లో ప్రతి రోజు ఎంతో మందిని పరిచయం చేస్తుంటాం.
ఇదిగో, సమాజం కోసం ఆలోచించే మరో మంచి వ్యక్తి గురించి మీ కోసం...
ఐటీ రంగంలో 17 ఏళ్ల అనుభవం, సీనియర్ డైరెక్టర్గా అత్యున్నత పదవిని వదులుకొని పూర్తిస్థాయి సమాజ సేవకు అంకితమయ్యారు దుర్గా కళ్యాణి.
'జగతి ఫౌండేషన్' ద్వారా ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లోని సుమారు 1 లక్ష మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన సేవలనందించారు. ముఖ్యంగా 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, 5,000 మందికి పైగా మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు.
కార్పొరేట్ కెరీర్ ఇచ్చే హోదా కంటే, పేద పిల్లల చదువు, మహిళల సాధికారత కోసం పనిచేయడమే తనకు అసలైన సంతృప్తిని ఇస్తుందని ఆమె నిరూపిస్తున్నారు.
#GoodNews #seva #servefirst #durgakalyani #🙆 Feel Good Status #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status


