నేను తెలుగువాడిని...నాది తెలుగుదేశం అని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్. తెలుగువారిని మదరాసీయులు అని అంటున్న సమయంలో తెలుగువారు వేరు, మదరాసీయులు వేరు అని నిరూపించారు. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలనే ఉద్దేశంతో ప్రాణత్యాగం చేసి మనకు తెలుగురాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారిని మరువలేం. తెలంగాణ, ఏపీ కలిసి ఉండాలనే ఉద్దేశంతో తెలుగుజాతి ఐక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు గారు ఆ నాటి ముఖ్యమంత్రిగా పదవికి రాజీనామా చేసి ఉద్యమాలు చేశారు. ఈనాడు పత్రికద్వారా తెలుగుజాతికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావుగారిని తెలుగుజాతి మరువలేదు. నేడు మనమంతా వీరి వారసులుగా తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
02:10

