#🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
*ఉప్పు నీరు తో పంట చేలకు తీవ్ర నష్టం...*
అమలాపురం సమీపంలోని ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు ఓల్డ్ సమనస నుండి కిత్తన చెరువు బోనులు వరుకు గల డ్రైనేజీ కి గండ్లు పడి గల్లు ద్వారా చేపల చెరువులు లోనుండి తోడిన ఉప్పు నీరు చేలు చుట్టూ చేరి వరిచేలు పాడై పోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఊడ్చి నచేలో నీరు దిగక దిగే మార్గం లేకపోవుట వలన తూటు గుర్రపు డెక్క పెరిగి పోవడం వల్ల సర్వే నెంబర్ 510, 500-2బి ,501,502 ,501-3బి,501-3ఎ 501-2 , 501-4,502-1 నెంబర్లు గల వరిచేలు నష్టపోయాయని ఆ ఏరియా రైతులు ఆవేదన వ్యక్తం చేసారు..ఎన్నో రూపాయలు ఖర్చు చేసి వరి పంట సాగు చేశా మని ఆక్వా చెరువు ల నీరు కారణంగా వరి చేలు పాడై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు.
తొలకరిలో ఆకుమడులు వేసిన మురికి కాలువ నుండి ఆకుమడులు ములుగుట వలన తొలకరి సాగు చేయ లేక పోయామన్నారు. మురికి కాలువ గురించి పట్టించుకున్ననాధుడే లేడని వాపోయారు.నీటి సంఘం అధ్యక్షులు గాని రెవెన్యూ అధికారులు కానీ డ్రైనేజీ అధికారులు కానీ పట్టించుకోవడంలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి స్వయంగా పరిశీలన చేసి రైతులను కౌలు రైతులను ఆదు కోవాలని కోరుతున్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


