తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఏడు కొండలు అవసరం లేదు… రెండు కొండలు చాలు అంటూ జీవో ఇచ్చిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి. దాన్ని వ్యతిరేకించి శాసనసభలో కూడా ఆన్ రికార్డు మాట్లాడిన వ్యక్తి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
చరిత్రలో తేదీలతో సహా ఈ వాస్తవం ఇంత స్పష్టంగా ఉన్నా కూడా జగన్ రెడ్డి నేతృత్వంలోని సైకో మూకలు ‘‘గెరిల్లా సమాచార యుద్ధం’’ చేస్తూ అసత్యాలను నిజాలుగా… నిజాలను అసత్యాలుగా చెప్పేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నాయి.
వాస్తవాలు (తేదీలతో సహా) ఈ విధంగా ఉన్నాయి:
GO Ms No. 338 of 2005 (జారీ తేదీ 16–09–2005) – Government of Andhra Pradesh
జి.ఓ. ఎమ్ఎస్ నెం. 338 (2005) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జారీ చేసిన ఒక ముఖ్యమైన ఉత్తర్వు. ఇది ప్రధానంగా తిరుమల–తిరుపతి ప్రాంత పరిపాలనకు సంబంధించినది.
ఈ జీవో ముఖ్యోద్దేశ్యం తిరుమల ప్రాంతాన్ని ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా గుర్తించడం
1. తిరుమల కొండపై ఉన్న ప్రాంతాన్ని సాధారణ గ్రామపంచాయతీ పరిధి నుండి వేరుచేసి, ప్రత్యేక ధార్మిక–పరిపాలనా ప్రాంతంగా గుర్తించే ప్రక్రియకు ఈ జి.ఓ. జారీ చేశారు.
2. ఈ ఉత్తర్వు ద్వారా Tirumala Tirupati Devasthanams (TTD) పరిపాలనా అధికారాలు కేవలం రెండు కొండలకే పరిమితం చేశారు.
ఈ జీవో వెలువడిన తర్వాత చాలా కాలం దీన్ని బయటకు రాకుండా చూశారు. ఈ విషయం బయటకు వెల్లడి కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ముస్లిం అనుకూల విధానాలు, ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తుండటం వల్ల అంత బాహాటంగా హిందూ ధర్మానికి మద్దతు ఇచ్చేవారు తక్కువగానే ఉండేవారు. అయినా సరే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆనాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ఏడుకొండల వేంకటేశ్వరుడిని కేవలం రెండు కొండలకే పరిమితం చేయడాన్ని హిందువులంతా వ్యతిరేకించారు. శ్రీ వేంకటేశ్వరుడి భక్తులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేశారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలోనూ, క్షేత్ర స్థాయి లోనూ అలుపెరగని పోరాటం చేశారు.
ఫలితంగా రాజశేఖరరెడ్డి తన తప్పును తెలుసుకుని జి.ఓ. ఎమ్ఎస్ నెం. 746, తేదీ: 02-06-2007, రెవెన్యూ (ఎండోమెంట్స్-II) శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేశాడు.
ఈ జీవోలో ముఖ్యాంశాలు:
జి.ఓ. ఎమ్ఎస్ నెం. 746 ప్రధాన అంశాలు
1.“తిరుమల దివ్యక్షేత్రం”గా ప్రకటన:
తిరుమలలోని మొత్తం ఏడు కొండలు (శేషాచలం పర్వత శ్రేణి), వాటికి సంబంధించిన తీర్థాలు, మార్గాలు మరియు పరిసర ప్రాంతాలను కలిపి “తిరుమల దివ్యక్షేత్రం” గా ప్రకటన.
2. పరిధి: అలిపిరి, బాలపల్లి, చంద్రగిరి తదితర మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే ప్రాంతాలు, పవిత్ర తీర్థాలు, దేవస్థానం పరిధిలోని అన్ని ప్రాంతాలు ఈ దివ్యక్షేత్రంలో భాగంగా పరిగణించబడతాయి.
3. పవిత్రత పరిరక్షణ: ఈ ప్రాంతంలోని హిందూ ధార్మిక సంప్రదాయాలు, ఆచారాలు, పూజా విధానాలు మరియు ఆధ్యాత్మిక విశిష్టతను కాపాడేందుకు ప్రత్యేక రక్షణ.
4.పరిపాలన: ఈ ప్రాంతంలోని స్థానిక పరిపాలన బాధ్యతలు తిరిగి Tirumala Tirupati Devasthanams (TTD) కార్యనిర్వాహణాధికారి (Executive Officer)కి అప్పగించారు.
దీనితో బాటే రాజశేఖరరెడ్డి మరొక జీవో జారీ చేశారు. అది:
జి.ఓ. ఎమ్ఎస్ నెం. 747, తేదీ: 02-06-2007, రెవెన్యూ (ఎండోమెంట్స్–III) శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఈ జీవో ముఖ్యాంశాలు:
1. సంప్రదాయంగా ఏ మతం ఆచరించబడుతున్నదో, ఆ పూజా స్థలాలలో అదే మతానికి సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే జరగాలి. ఇతర మతాల ప్రచారం అక్కడ నిషేధించబడుతుంది.
2. చట్టపరమైన ఆధారం: ఈ ఉత్తర్వు Andhra Pradesh Propagation of Other Religions in Places of Worship or Prayer (Prohibition) Ordinance, 2007 ప్రకారం జారీ చేయబడింది.
3. నోటిఫై చేసిన ప్రాంతాలు: ఈ జి.ఓ. ద్వారా రాష్ట్రంలోని కొన్ని ముఖ్య పూజా స్థలాలు నోటిఫై చేయబడ్డాయి. అందులో ముఖ్యంగా:
Tirumala Divya Kshetram (జి.ఓ. ఎమ్ఎస్ నెం. 746 ద్వారా ప్రకటించబడిన ప్రాంతం)
Tirumala Tirupati Devasthanams (TTD) పరిధిలోని తీర్థాలు
రాష్ట్రంలోని ప్రధాన హిందూ దేవాలయాలు:
Sri Durga Malleswara Swamy Devasthanam
Sri Kalahasteeswara Swamy Temple
Sri Bhramaramba Mallikarjunaswamy Temple
Sri Seetharamachandra Swamy Temple
Sri Lakshmi Narasimha Swamy Temple
హిందువుల ఉద్యమాలు, చట్ట సభలో చంద్రబాబునాయుడు వత్తిడితో రాజశేఖరరెడ్డి తన తప్పును జీవోలతో సరిదిద్దాడు కానీ హిందూ ధార్మిక సంస్థల పట్ల రాజశేఖరరెడ్డి వివక్ష మాత్రం కొనసాగింది.
రాజశేఖరరెడ్డి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రముఖ దేవస్థానాలకు చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయనే పేరుతో దేవుడి మాన్యాలను రాజశేఖరరెడ్డి తెగనమ్మాడు.
ఆనాటి తన అనుయాయులు దేవాలయ భూములను కారు చౌకగా కొట్టేశారు.
సింహాచలం, అన్నవరం లాంటి ప్రముఖ దేవస్థానాల దేవుడి మాన్యాలను రాజశేఖరరెడ్డి మనుషులు, అన్యమతస్థులు కొట్టేశారు.
రాజశేఖరరెడ్డి చేసిన ఇలాంటి దైవ వ్యతిరేక కార్యకలాపాలకు చంద్రబాబు అడ్డుపడ్డారు.
ఈ రెండు జీవోలు ( జి.ఓ. ఎమ్ఎస్ నెం. 747, తేదీ: 02-06-2007, జి.ఓ. ఎమ్ఎస్ నెం. 746, తేదీ: 02-06-2007) ద్వారా రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై రాజశేఖరరెడ్డి ఆంక్షలు విధించాడు.
ఈ రెండు జీవోలను తాను అధికారంలోకి రాగానే ఎత్తేస్తానని చంద్రబాబునాయుడు 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇప్పుడు జగన్ రెడ్డి, తన తండ్రి ముందుగా జారీ చేసిన GO Ms No. 338 of 2005 (జారీ తేదీ 16–09–2005)ను ప్రస్తావించకుండా, తప్పు దిద్దుకున్న జి.ఓ. ఎమ్ఎస్ నెం. 746, తేదీ: 02-06-2007 గురించి ప్రస్తావిస్తున్నాడు. అంతే కాదు తాను అధికారంలోకి రాగానే దేవుడిపై రాజశేఖరరెడ్డి విధించిన ఆంక్షలను రద్దు చేస్తానని చెబుతూ చంద్రబాబునాయుడు జి.ఓ. ఎమ్ఎస్ నెం. 746 రద్దు విషయం ప్రస్తావిస్తే చంద్రబాబే ఏడు కొండలను వ్యతిరేకిస్తున్నట్లు జగన్ రెడ్డి చెబుతున్నాడు.
ఆనాడు రాజశేఖరరెడ్డి మత కుట్రతో GO Ms No. 338 of 2005 (జారీ తేదీ 16–09–2005) జారీ చేయడం తదనంతర పరిణామాల కారణంగా ఈ జీవో రద్దు అయితే అలిపిరి నుంచి కొండకు నడిచి వస్తానని చంద్రబాబునాయుడు మొక్కుకుని రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఆ జీవో రద్దు అయిన తర్వాత కొండకు నడిచి వెళ్లారు.
ఇవీ నిజాలు…. ఇదీ చరిత్ర…..
జగన్ రెడ్డి అబద్దాల కోరు…. అతని తండ్రి రాజశేఖరరెడ్డి ఒక దైవ ద్రోహి… #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱


