ShareChat
click to see wallet page
search
పేదలు నివసించే కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలి. రెడ్డిగూడెంలో పక్కాగృహాలు మంజూరు చేయాలి. -అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి విజ్ఞప్తి. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 04.03.2026. పేదలు నివసిస్తున్న కాలనీల్లో తక్షణమే మౌలిక వసతులు, కనీస సదుపాయాలు కల్పించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు బుధవారం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఇంటిపట్టాలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. కానీ అప్పటి కాలనీల్లో ఇళ్ళు నిర్మించుకున్న వారు చాలా అవస్థలు పడుతున్నారన్నారు. మైలవరం నియోజకవర్గంలో 69 కాలనీలు ఏర్పాటు చేసి, దాదాపుగా 16,700 ప్లాట్లు కేటాయించగా కేవలం 2,000లోపు గృహ నిర్మాణాలు సంపూర్ణంగా పూర్తి చేశారన్నారు. ఇబ్రహీంపట్నంలోని గాజులపేట, కొండపల్లి, ఈలప్రోలు, జి.కొండూరు, మైలవరంలోని పూరగుట్ట ప్రాంతాల్లో లే అవుట్లు ఏర్పాటు చేశారన్నారు. కాలనీల్లో చాలా చోట్ల రహదారులు, విద్యుత్తు సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయం కూడా లేవన్నారు. దీనివల్ల మిగిలిన వారు ఆయా కాలనీలలో ఇళ్ళు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. పేదల అవస్థలను ఏడాది క్రితం ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు, హౌసింగ్ అధికారులతో కలసి స్వయంగా పరిశీలించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆయా కాలనీల్లో బురద వల్ల అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు తదితర వాహనాలు లోపలికి వెళ్లే అవకాశం లేదన్నారు. రెడ్డిగూడెం మండలంలో 1,634 మందికి ఇంటిపట్టాలు మంజూరు చేశామని అన్నారు. ఈ మండలం రూరల్ ఏరియాలో ఉండటం వల్ల ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేయలేదన్నారు. రెడ్డిగూడెం గ్రామంలో 400కి పైబడి ప్లాట్లు ఉన్న లే అవుట్లో కేవలం విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించి, పక్కాగృహాలు మంజూరు చేస్తే ఇళ్ళు కట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం తప్పితే ఆ ఇంట్లో గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించలేదన్నారు. కొత్తగా ఇళ్లస్థలాలు ఇచ్చే లోపు ఆయా కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. గత ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది తప్ప ప్రజల అవసరాలను విస్మరించిందన్నారు. కనుక హౌసింగ్ కాలనీలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు కోరారు. #🟡తెలుగుదేశం పార్టీ
🟡తెలుగుదేశం పార్టీ - ؟  పసంఠవెంకట కృష్ణత్రసాద (ఎడం) నాజిససర్యల oமல800   ؟  పసంఠవెంకట కృష్ణత్రసాద (ఎడం) నాజిససర్యల oமல800 - ShareChat