అనారోగ్య బాధితులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
04.01.2026 – ఆదివారం
అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్య బాధితులు హైదరాబాద్ నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, చికిత్స అందిస్తున్న వైద్యులతో నేరుగా మాట్లాడారు. రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు ఎలాంటి ఆలస్యం లేకుండా సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చికిత్స విషయంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూస్తానని, అవసరమైన సహాయం పూర్తిగా అందిస్తానని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల తన నిబద్ధతను మరోసారి స్పష్టంగా తెలియజేశారు. #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు


