#😃మంచి మాటలు విష్ణు సహస్ర నామము
నరః
నశించనివాడు రఅనగానాశనము నాశనము లేనివాడు. నాశనము లేని చేతనా చేతనములను విభూతిగా గలవాడుప్రాణులను సృష్ట్యా దుల చేత తమ తమ వ్యాపార ములందు ముందుకు తీసుకొని పోయే వాడు.
సృష్టి పరిణామము ఆరు విధాలు
జాయతేస్తి పరిణమతే వర్ధ తేక్షీయతే వినశ్యతి అని నిరుక్తములో చెప్పబడినది.
జాయతే పుడుతున్నది.
అస్థి అస్థిత్వము పొందుతున్నది
పరిణమతే పరిణామము పొందుతున్నది
వర్ధతే వర్ధిల్లు తున్నది పెరుగుతున్నది
క్షీయతే క్షీణిస్తున్నది
నశ్యతి నశించుచున్నది
అయితే ఈ ఆరు దశలు ఒక దానితో ఒకటి కలసి మెుత్తం మూడుదశలు అవుతున్నాయి. పుట్టుక. అస్థిత్వము, పరిణామము. పొందటము, వర్ధిల్లటము, స్థితి, క్షీణించటము, నశించటము, లయము ఈ దశ లన్నింటికీ కారణము పరబ్రహ్మ.అతడు ఈ దశలలో ఈ జగత్తును ముందుకు తీసుకు పోతున్నాడు. యిలా జరిగిన సృష్టి క్రమంలో మానవులు కొంతమంది పార లౌకిక విషయాలను గురించి ఆలోచిస్తారు. అటువంటి వారికి తన భక్తులకు జ్ణా నోపదేశం చేస్తాడు
ఆజ్ణానులలో అర్హులైన వారికి ముక్తిని ప్రసాదిస్తాడు.ముక్తి అంటే విముక్తి. ఐహిక బంధనాల నుంచి విముక్తి నేను, నాది అనే అహంకార, మమకారాలను వదలి పెట్టిన వాడికి అరిషడ్వర్గాలను జయించిన వాడికి ఆత్మసాక్షాత్కారమవుతుందిదాన్నే స్సస్వరూప జ్ణానము అంటారు.
అంటే చరాచర జగత్తు తనలోనే వున్నది తనకు ఈ జగత్తులోని మిగిలిన జీవరాశి కి తేడా లేదు. తనలో వున్న తేజస్సే తనలో కూడా వున్నది. ఈ రకంగా జగత్తంతా పరమేశ్వర మయము.అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వాడు బ్రహ్మాత్మ సిద్ధి పొందుతాడు.
బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి
పరబ్రహ్మను గురించి తెలుసుకున్న వాడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ అవుతాడు అతడికి జననమరణాలు వుండవు అదే సాయుజ్యము, ముక్తి, అని చెప్పబడినది. సృష్టి, స్థితి, లయాదులను చెయ్యటం ద్వారా పరమేశ్వ రుడైన అర్హు లైన తన భక్తు లకు జ్ణానాన్ని ప్రసాదించి వారికి ముక్తిని యిస్తున్నాడుఅందుకే శ్రీ మన్నారాయణుడు నరః అనబడుతున్నాడు.
సర్వతోముఖీ


