ShareChat
click to see wallet page
search
జిల్లా ఎస్పీ డి. జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆరైవ్ లైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం పోలేపల్లి సెజ్ ఆమ్నీల్ ఆంకాలజీ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు ప్రారంభించిన “ఆరైవ్ లైవ్” నినాదం మేరకు పట్టణాలలో మరియు పల్లె పల్లెనా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో, రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలేపల్లి సెజ్ ఆమ్నీల్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. అలాగే త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరించారు. ముఖ్యంగా హైవేల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ఎస్పీ గారు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ గుహీలోత్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్‌ఐ శివానందం గౌడ్, పోలీసు సిబ్బంది, కంపెనీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. #MahabubnagarPolice #roadsafetyawareness #📰 వార్తలు
📰 వార్తలు - ARRIE ALIVE YOU FOUS PROTECT IT BE RESP BE SAFE a CAHPAIGN AIELIIILIT PR IIBN LIUE ARRIE ALIVE YOU FOUS PROTECT IT BE RESP BE SAFE a CAHPAIGN AIELIIILIT PR IIBN LIUE - ShareChat