ShareChat
click to see wallet page
search
#😃మంచి మాటలు యెాగ గణపతి యెాగ సాధనంతా అధ్యాత్మిక విజయము కోసమే యెాగసాధకుల అంతిమ లక్ష్యం ముముక్షుత్వమే కావాలిఅంటుంది శాస్త్రము అది సాధ్యము కావాలంటే మానవశరీరంలోని షట్చక్రాలు ఉత్తేజితం అవ్వాలి అప్పుడేశిరస్సుపై వుండే సహస్రారము ఉత్తేజితమై మెాక్షానికి చేరువ అవుతారు. అయితే ఏ క్రతువు చేసినా తొలిపూజ గణపతికే చెందుతుంది. అలాగే ఈ యెాగ సాధన సైతము గణపతికే చెందుతుందిఅలాగే ఈ యెాగ సాధన సైతము గణపతి అధిష్టానంగా భావించే మూలాధార చక్రంతోనే మెుదలవుతుందని యాజ్ణవల్క్య స్మృతి చెబుతున్నది. త్వం మూలాధారే స్థితోసి నిత్యమ్ త్వం యెాగినో ధ్యాయంతి నిత్యమ్ అంటుంది గణపతి అధర్వ శీర్షం. మానవశరీరములోని మూలాధార స్ధానములో వుండే దైవానివి నీవే యెాగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ వుంటారని భావము.యెాగశాస్త్రంలో గణపతిని మూలాధారచక్రానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. మూలాధారము ఉత్తేజితమైనప్పుడు అక్కడి నుంచి పైన వుండే సుషుమ్న నాడి మేల్కొంటుంది,తద్వారా సాధనా క్రమంలో మిగితా ఐదు చక్రాలు ఉత్తేజితము అవుతాయిసుషుమ్న కుయిరు ప్రక్కల వుండే ఇడ, పింగళ నాడులు ప్రధానమైనవి.ఇడ బుద్ధికి పింగళసిద్ధికి సంకేతంగా భావిస్తారు. సుషుమ్న ఎప్పుడూ ఈ రెండు నాడులతోనే కలిసి వుంటుంది మూలాధారము గణపతిఅయితే యిడ, పింగళ సిద్ధి, బుద్ధి అన్న మాట యెాగ సాధనతో శరీరము, మనసు పవిత్రం అయినప్పుడు బుద్ధి వికసిస్తుంది.ఫలితంగా సిద్ధి కలుగుతుంది సర్వతోముఖీ
😃మంచి మాటలు - ShareChat