ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శాంతియుతంగా నిర్వహించండి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జిల్లాలో నిర్వహించబడే ఉత్సవాలు, ర్యాలీల దృష్ట్యా శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పి శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు నిర్వాహకులకు క్రింది కఠిన సూచనలు జారీ చేశారు.జిల్లా ఎస్పి గారి సూచనలు – తప్పనిసరిగా పాటించవలసినవి1. ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.2. పోలీసులు సూచించిన మార్గాల్లోనే ర్యాలీ నిర్వహించాలి.3. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సమయపాలన పాటించాలి.4. ప్రధాన రహదారులను దిగ్బంధం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.5. డీజేలు, అధిక శబ్ద పరికరాలు ఉపయోగించరాద.6. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.7. అశాంతి లేదా ఉద్రిక్తతలకు దారితీసే నినాదాలు, ప్రవర్తన చేయరాదు.8. ర్యాలీ భద్రత కోసం నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను నియమించాలి.9. మహిళలు, పిల్లలు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.10. ర్యాలీలో పాల్గొనే వాహనాలు నియంత్రిత వేగంతో నడపాలి.11. ప్రజా ఆస్తులకు నష్టం కలిగితే నిర్వాహకులపై బాధ్యత ఉంటుంది.12. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.13. మద్యం సేవించి ర్యాలీలో పాల్గొనడం పూర్తిగా నిషేధం.14. అత్యవసర వాహనాల రాకపోకలకు మార్గం ఖాళీగా ఉంచాలి.15. పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.16. అనుమతి నిబంధనలు ఉల్లంఘించినా, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.17. డీజేలు లేదా నిషేధిత శబ్ద పరికరాలు ఉపయోగించినట్లయితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.18. చట్టవ్యతిరేక చర్యలు, శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.19. పోలీసుల ఆదేశాలను పాటించని నిర్వాహకులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి.శాంతియుత వాతావరణం కాపాడేందుకు నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి.జిల్లా ఎస్పి గారు నిర్వాహకులు నిబంధనలు పాటించి శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని హెచ్చరించారు.#MahabubnagarPolice #📰 వార్తలు

