ShareChat
click to see wallet page
search
*భౌమ వాసర (మంగళవారం) ఆనంద శుభోదయం.* 🪷🪷🪷 *మాఘమాసం బహుళ అమావాస్య సాయంత్రం 5.47 వరకు., అన్వాధానం, పిండ పితృ యజ్ఞం* 🪷🪷🪷 *చరిత్రలో నేడు 17th Feb*👇👇👇 _______________ *17.2.1600* *శాస్త్రవేత్తను చంపి 300 సంవత్సరాలకి క్షమాపణలు.* *నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సత్యాన్వేషణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.* 👇👇👇 *భూమి కేంద్రంగా భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు మిగిలిన గ్రహాలు తిరుగుతున్నాయి అనే సిద్ధాంతానికి వ్యతిరేకంగా, సూర్యుడే కేంద్రంగా సూర్యుడి చుట్టూ భూమి ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి అని ప్రతిపాదించిన బ్రూనో అనే వైజ్ఞానికుడిని ఇటలీలోని చర్చి పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, బ్రూనో ని బంధించి సంవత్సరాల తరబడి కఠినమైన జైలు శిక్ష విధించారు. అయినా సరే బ్రూనో వారి ఒత్తిడికి లొంగకుండా బైబిల్ లోని పలు అశాస్త్రీయమైన విషయాలను ప్రశ్నించడం చర్చి పెద్దలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. బ్రూనోకు మరణశిక్ష విధించి "17.2.1600" తేదీనాడు బహిరంగంగా సజీవ దహనం చేసి చంపేశారు. చనిపోయే ముందు తాను తప్పు మాట్లాడినట్లు ఒప్పుకుని క్షమాపణ కోరితే బ్రూనోని క్షమిస్తామని చెప్పడం జరిగింది. కానీ బ్రూనో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని కానీ, వేసిన ప్రశ్నలను కానీ, వెనక్కి తీసుకోకుండా ఎంతో ధైర్యంగా మరణించడానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా బ్రూనో చనిపోయిన చాలా సంవత్సరాలకి శాస్త్రవేత్తలు బ్రూనో ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతం ( సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అనే సత్యం) నిజమేనని కనుగొన్నారు. బ్రూనోని చంపడం ఘోరమైన తప్పిదంగా ఒప్పుకున్నారు. తర్వాత సంవత్సరాలలో పోప్ జాన్ పాల్ 2 కూడా బ్రూనోని శిక్షించినందుకు విచారం వ్యక్తం చేసి క్షమాపణ కోరాడు. బ్రూనో చనిపోయిన ప్రదేశంలో దాదాపు 300 సంవత్సరాల కి 1889లో ఇటలీలో స్మారక చిహ్నం నిర్మించారు.* 👇👇👇 *"సత్యమేవ జయతే" అంటే సత్యం మాత్రమే ఎప్పటికైనా జయిస్తుంది. ఈ ప్రకారంగా బ్రూనో మరణించిన తేదీని ప్రపంచ సత్యాన్వేషణ దినోత్సవంగా జరుపు కుంటున్నారు.* 🙏🙏🙏 ___________ *17.2. 1618* జహంగీర్ చక్రవర్తిని కలిసిన తర్వాత *ఈ దేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో* ఇంగ్లాండ్ తిరుగు ప్రయాణమైన మొదటి ఇంగ్లీష్ అంబాసిడర్ థామస్ రో. ________ *17. 2.1670* పరమవీరుడైన తానాజీ ప్రాణత్యాగంతో మొగలుల అధీనంలో ఉన్న సింగ్ ఘర్ కోటను స్వాధీనం చేసుకున్న మరాఠా మహారాజ్ ఛత్రపతి శివాజీ. *కోటను గెలుచుకున్నప్పటికీ సింహాన్ని పోగొట్టుకున్నామంటూ* దుఃఖించిన ఛత్రపతి శివాజీ. ______ *17.2.18 83* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు విప్లవ వీరుడు *వాసుదేవ బల్వంత్ ఫడ్కే* బ్రిటిష్ వారి జైలులో మృతి. వీరికి నివాళులు.🙏🙏🙏 _____________ *17.2.1931* మోహన్ దాస్ కరంచంద్ గాంధీని ప్రజల తరఫున ముఖ్య నాయకుడిగా గుర్తిస్తూ Vicregal Lodge లో ( ప్రస్తుత రాష్ట్రపతి భవన్ ) చర్చలకు ఆహ్వానించిన వైస్రాయ్ ఇర్విన్. చర్చలలో పాల్గొన్న విన్ స్టన్ చర్చిల్ ( తర్వాత రోజుల్లో ఈయన బ్రిటన్ ప్రధాన మంత్రి పదవిని కూడా వెలగబెట్టాడు ) చర్చల అనంతరం మోహన్ దాస్ కరంచంద్ గాంధీని *అర్థనగ్న ఫకీర్* అని చులకనగా సంబోధించాడు. _____________ *17. 2. 1980* ఎమర్జెన్సీ కష్టాలు కళ్లెదుట కనబడుతున్నా సరే, గతిలేక ప్రజల చేత తిరిగి ఎన్నుకోబడిన ఇందిరాగాంధీ.. తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే *9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను* రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలనను విధించింది. ( తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర ,పంజాబ్ ,గుజరాత్ ,రాజస్థాన్). ____________ *17.2 .19 86* ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త , వేదాంతి *జిడ్డు కృష్ణమూర్తి* గారు 90 సంవత్సరాల వయసులో మరణించారు. వీరికి నివాళులు. 🙏🙏🙏 _______ 🙏🙏🙏 #📰జాతీయం/అంతర్జాతీయం #🇮🇳దేశం #చరిత్ర #jaago bharat