ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ దిగ్భ్రాంతి, విచారం
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందడం, రెండు కోచ్లు పూర్తిగా దగ్ధమయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. #😇My Status #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ


