Vetlapalem Blast: మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Vetlapalem Blast: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు.