జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంత శాసనసభ్యులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కోరారు.
✅ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
✅ ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కోరారు.
✅ ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట) గారు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక) గారు, కోరం కనకయ్య (ఇల్లందు) గారు తెల్లం వెంకట్రావు (భద్రాచలం) గారు, వెడ్మ బొజ్జు (ఖానాపూర్) గారు ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా ఉన్నారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ