తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజర్షి షా దివ్యాంగ చిన్నారుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా AI ల్యాబ్ను ప్రారంభించారు. దీని ద్వారా ఇంటరాక్టివ్, సెన్సరీ లెర్నింగ్ మెథడ్స్ వంటి కొత్త టీచింగ్ మెథడ్స్ ను ప్రవేశపెట్టారు. ఈ ఏఐ సిస్టమ్ ద్వారా పిల్లలు కేవలం చూసి నేర్చుకోవడమే కాకుండా, సెన్సార్ల సాయంతో పాఠాలను సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది. సుమారు 15 లక్షల రూపాయలతో, ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్, జిల్లాలోని సుమారు 2,000 మందికి పైగా దివ్యాంగ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వనుంది.
#TALRadioTelugu #AILab #InclusiveEducation #SpecialNeedsEducation #EdTechIndia #AIforGood #DisabilityInclusion #AccessibleLearning #SensoryLearning #InteractiveEducation #Telangana #Adilabad #InnovationInEducation #FutureOfLearning #EducationForAll #TALRadio #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status


