#😃మంచి మాటలు ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు సమర్పిస్తారు?
హనుమంతుడికి వనమాల ను సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి పసివాడుగా వున్న హనుమంతుడు కనిపించిన ప్రతీ దానిని తినాలనుకుంటాడు..ఆకలిగా వున్న సమయం లో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుని చూసి పండుగా భ్రమిస్తాడు.
ఆకాశంలో ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలనే కుతూహలంతో వేగంగా వెళుతూ వుంటాడు.మరోవైపు గ్రహణం సమీపిస్తూ వుండటంతో రాహువు సైతము సూర్యుడికి అడ్డుగా వస్తూంటాడు. అప్పటికీ ఆకలి మీద వున్న హనుమంతుడు తన త్రోవకు అడ్డు వచ్చిన రాహువును ఒక్కతన్ను తన్ని పక్కకు పంపే స్తాడు. రాహువుకు జరిగిన అవమానం తెలుసుకున్న యింద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు
.వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు. దాంతో దేవతలంతా దిగి వచ్చి వాయుదేవున్ని శాంతింప చేసేందుకు ఆంజనేయుడికి తన వద్ద నున్న వరాలను ప్రసాదిస్తారు.ఆ సమయంలో రాహువు సైతం వరమిచ్చి హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారికి రాహు దోషాలు తొలగి పోతాయి అని అందుకే వడలతో చేసిన వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
హనుమకు రాహువు వరం
బాలహనుమంతుని శౌర్యం చూసిన రాహువు హనుమంతుడిని మెచ్చుకున్నాడు.హనుమంతుడికి ఒక వరం యిచ్చాడు.హనుమంతుని పూజించే వారు రాహువుకు యిష్టమైన మినపప్పుతో చేసిన ఆహారాన్ని హనుమకు నైవేద్యంగా సమర్పిస్తే రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని వర మిచ్చాడు.
పాము రూపంలో వడమాల
హనుమకు అలా సమర్పించే మినపప్పు ప్రసాదం ఎలా వుండాలో కూడా రాహువు వివ రించాడు అది పాములా అంటే తన శరీరభాగంలావుండాలని రాహువు హనుమంతుడికి వివరించాడు.అందుచేతనే హనుమకు సమర్పించే గారెలు మాలగా చేసి సమర్పించే ఆనవాయితీ వచ్చింది. అందుకనే హనుమాన్ ఆలయాల్లో భక్తులు వడమాలలను సమర్పిస్తారు.
హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పిస్తే శని దోషాలు తొలగిపోతాయని అధ్యాత్మిక పండితులు తెలియ చేస్తున్నారు
సర్వతోముఖీ


