“అరైవ్ అలైవ్” నినాదంతో మహబూబ్నగర్లో రోడ్డు భద్రత బైక్ ర్యాలీ
హెల్మెట్ వాడకం ద్వారా ప్రాణ రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ బైక్ ర్యాలీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమై క్లాక్ టవర్, అశోక టాకీస్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, మెట్టుగడ్డ యూ-టర్న్ తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న పోలీసు సిబ్బంది అందరూ తమ తమ ద్విచక్ర వాహనాలతో హెల్మెట్లు ధరించి పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా ప్రయాణిస్తూ ప్రజలకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ కవచమని తెలిపారు. “అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే సీట్బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
#MahabubnagarPolice #RoadSafetyAwareness #📰 వార్తలు
02:01
