మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
పర్యటించారు. రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు దోర్నాల మండలం, గంటవానిపల్లిలో శంకుస్థాపన చేశారు. అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండివీరారెడ్డి అనే రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించారు. ప్రాజెక్టు నమూనా పరిశీలన అనంతరం పనులపై అధికారులతో సమీక్షించారు. వెలిగొండ టన్నెళ్ల పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సీఎం మాట్లాడారు.
#VeligondaProject
#MarkapuramDistrict
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢


