ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారితో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల శ్రీకారం కార్యక్రమం లో పాల్గొన్న కిషోర్ గునుకుల గారు
JanaSena Party క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ #PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళంగా అందించి తొలి సభ్యత్వాన్ని స్వయంగా తీసుకోవడం ద్వారా కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు.
#KishoreGunukula - జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని ఆశయాలకు అనుగుణంగా పనిచేసేవారిని “ఉద్యమి”, పార్టీ సిద్ధాంతాలకు కొత్త తరాన్ని ఆకర్షిస్తూ సభ్యత్వాలు నమోదు చేసేవారిని “సాధక్”, ప్రజా–రాజకీయ పోరాటాలకు పరోక్షంగా సమయం, ఆర్థిక, సాంకేతిక, మేథా సహకారం అందించేవారిని “ప్రదాత”గా పిలుస్తామని ప్రకటించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
150 మందితో ప్రారంభమైన పార్టీ ప్రయాణం లక్షలాది సభ్యులతో మహోద్యమంగా మారడం, ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలకు చేరుకోవడం జనసేన పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనం అని నాయకత్వం స్పష్టం చేసింది.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో నెల్లూరు సిటీ నుంచి అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు పాల్గొనడం గర్వకారణం.నెల్లూరు సిటీ తరఫున సభ్యత్వ నమోదు ప్రక్రియలో ముందంజలో నిలిచి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన ఆయనకు ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తాయి. అనంతరం అధ్యక్షుల వారితో అల్పాహారం విందులో కలిసి పాల్గొనడం జరిగింది
జనసేన బలోపేతానికి, పార్టీ ఆశయ సాధనకు నెల్లూరు సిటీ ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలుస్తుందనే సంకల్పాన్ని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ✊
Deputy CMO, Andhra Pradesh Nadendla Manohar
#JanaSenaMembership #Nellorecity #Andhrapradesh
#💫శుక్రవారం స్పెషల్ రాశిఫలాలు 🌟


