కిషోర్ గునుకుల
657 views • 1 days ago
నెల్లూరు: సంతపేట మెట్లదేవు రాగిచెట్టు సెంటర్లో గత నాలుగు సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు రజని, విజయమ్మతో పాటు స్థానిక మహిళలు, భక్తులతో కలిసి జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి దంపతులు బోనాల కార్యక్రమంలో, అమ్మవారికి చీర సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
— #KishoreGunukula
#JanaSenaParty , నెల్లూరు
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, దైవభక్తి, ఆధ్యాత్మికత సమాజంలో సానుకూలతను పెంపొందించడంతో పాటు చెడు అలవాట్లకు, దుష్ప్రవర్తనకు దూరంగా ఉండేలా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. గతంలో రాగిచెట్టు సెంటర్కు రావడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కనకదుర్గమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థానిక నాయకులతో మాట్లాడి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని కిషోర్ గునుకుల తెలిపారు.
ఈ సందర్భంగా స్థానికులు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భక్తులు మరియు స్థానిక ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. అలాగే కనకదుర్గమ్మవారి ఆలయ నిర్మాణం/పునర్నిర్మాణానికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి Dr. #PonguruNarayana గారి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
బోనాల కార్యక్రమం సంతపేట మెట్లరేవు నుంచి ప్రారంభమై, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా రాగిచెట్టు సెంటర్కు చేరుకుంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, చీర సమర్పణ నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
కిషోర్ గునుకుల మాట్లాడుతూ, తనకు ఎంతో అనుబంధం ఉన్న ప్రాంతంలో భక్తుల మధ్య దంపతిసమేతంగా అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పవిత్రమైన గోవింద నామాలను అవహేళన చేసేలా లేదా వికృతంగా పలికేలా చేసిన ఏ చర్యనైనా తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఇలాంటి ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భిన్న మతాల పట్ల పరస్పర గౌరవం, విశ్వాసాల పట్ల మర్యాదే మన సమాజానికి బలం.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి, ప్రశాంత్ గౌడ్, రవితేజ, ప్రియాంక, నిర్వాహకులు రజని, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు..
Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Shatagni Naga Babu Nadendla Manohar
#PawanKalyanAneNenu #Govindha #Andhrapradesh
#SanatanaDharma #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##pawankalyan ##janasena
10 likes
16 shares