👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
ఈ రోజు ప్రశ్న కు సమాధానం.
ప్రశ్న : శ్రీ కృష్ణుని కోరిక పై విశ్వకర్మ చేసిన రెండు బాల కృష్ణుని విగ్రహాలు పూజలందుకొంటున్న క్షేత్రాలు ఏవి.
సమాధానం : పుట్టగానే కన్న వాళ్లకు దూరమై యశోద నందుల వద్ద పెరిగిన శ్రీ కృష్ణుడు. తన అవతార లక్ష్యాలు అన్ని పూర్తి అయ్యాక తనను పెంచిన తల్లి తండ్రులు అయిన యశోద నందులు, కన్న తల్లి తండ్రులు అయిన దేవకీ వాసుదేవులతో కలిసి ఎంతో సంతోషం గ ఉన్న సమయం అది.
ఆలా ఉండగా ఒక రోజు దేవకీ దేవి శ్రీ కృష్ణుని వద్దకు వచ్చి.
కన్నయ్య నీ బాల్యన్ని చూసి నీ బాల్య లీలలను దగ్గర నుండి చూసిన యశోద నందులు ఎంతో అదృష్టవంతులు.నేను నీ బాల్యన్ని చూడలేక పోయాను. ఆని బాద పడగా శ్రీ కృష్ణుడు ఆమె ను ఓదార్చి అమ్మ నీకు ఏం కావాలి చెప్పు ఆని అడుగుతాడు. అప్పుడు దేవకీ దేవి ఇలా అంటుంది. నువ్వు బాల్యం లో ఎలా ఉండేవాడివో చూడాలని కోరిక గ ఉంది నాయన ఆని చెప్పగా అప్పుడు శ్రీ కృష్ణుడు వెంటనే విశ్వకర్మ ను పిలిచి తన బాల్య రూపం లోని రెండు విగ్రహాలు చేసి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు విశ్వకర్మ రెండు విగ్రహాలు చేసి ఇస్తాడు. అందులో ఒకటి బ్రహ్మదేవుని కి శ్రీ కృష్ణుడు దర్శనం ఇచ్చిన రూపం ఆ రూపం లో చేతిలో పెరుగన్నం ముద్ద ఇంకో చేతి నీ నడుము పై ఉంచుకొని మొల కు కొమ్ముబూర వేలాడుతూ ఉండే రూపం.ఐతే రెండవది శ్రీ కృష్ణుని పసి రూపం.
ఆ రూపం లో ఒక చేతిలో కవ్వం ఇంకో చేతిలో చిన్న తాడు పట్టుకుని ఉన్న రూపం.
దేవకీ దేవి ఎంతో సంతోషం తో ఆ విగ్రహాలను స్వీకరించి వాటిని ఎంతో ముద్దు గ చూసుకొంటూ ఉంటుంది.
*****
శ్రీ కృష్ణుడు తన అవతారం సమాప్తి చేసాక..
ద్వారక నగరం సముద్రం లో మునిగిపోతున్న సమయం లో
దేవకీ దేవి వద్ద ఉన్న రెండు విగ్రహాలలో బ్రహ్మ దేవునికి దర్శనం ఇచ్చిన రూపం లోని విగ్రహాన్ని వాయుదేవుడు, దేవగురువు బృహస్పతీ కలిసి రక్షించి కేరళ దేశం లోకి తెచ్చి ప్రతిష్ట చేస్తారు.
ఆ విగ్రహం పూజలు అందుకొనే ఆలయమే కేరళ ప్రజల ఆరాధ్య ఆలయం అయినా గురువాయుర్.
****
ఇక రెండో విగ్రహం ద్వారక భూగర్భం లో కలిసిపోయింది
కొన్ని వేల ఏళ్ళ తరువాత
****
ఒక నాడు వాయుదేవుని అంశ అయిన మధ్వాచార్యుల వారు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు వారికి దూరం గ ఒక పెద్ద ఓడ తుఫాను లో చిక్కుకొని తీరం తెలియక ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి ఆయన తన పంచె ను ఒక కర్ర కు కట్టి ఓడ లోని వారికి కనిపించేలా ఊపుతారు. అప్పుడు ఓడ లోని వారు తీరాన్ని గమనించి ఒడ్డు కు చేరుకొంటారు.
ఒడ్డు కు చేరాక ఆ ఓడ యజమాని మధ్వాచార్యుల వారిని సమిపించి ఆయనకు నమస్కరించి. ఇలా అంటాడు స్వామి మా ప్రాణాలు కాపాడారు మా ఓడ లోకి రండి మీకు ఏం కావాలో తీసుకోండి అనీ అంటాడు. అప్పుడు మధ్వాచార్యుల వారు తనకు ఏమీ అవసరం లేదని చెప్పిన ఆ నావికుడు వినకుండా ప్రాధేయపడడం తో సరే ఆని ఓడ లోకి వెళ్ళి చూడగా ఓడ మొత్తం బంగారు, వజ్రాలు, రత్నాల తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు మధ్వాచార్యుల వారు ఓడ మొత్తం తిరిగి ఒక మూల ఉన్న గోపి చందనం గడ్డ లను చూసి అందులో ఉన్న ఒక పెద్ద గడ్డ ను తనకు ఇమ్మంటాడు.
గోపి చందనం అంటే ద్వారక లో మాత్రమే దొరికే ఒక రకమైన మట్టి. ఆ మట్టి నీ తిలకం లాగ దరిస్తారు. అది చూసి నావికుడు అంటాడు స్వామి అవి బరువు సమాతూకం చెయ్యడం కోసం పెట్టిన రాళ్లు అవి ద్వారక లో దొరికే సాధారణ రాళ్లు ఎందుకు మీకు అంటే అప్పుడు మధ్వాచార్యుల వారు నాకు అదే కావాలి అనడం తో సరే అనీ ఆ గోపి చందనం గడ్డ ను ఇస్తాడు.
కిందకు తెచ్చి ఆ మట్టి గడ్డ ను కరిగించగా అందులోనుంచి విశ్వకర్మ తయారు చేసిన రెండో బాల కృష్ణుని విగ్రహం వస్తుంది. అప్పుడు దివ్యద్రుష్టి తో గ్రహించిన మధ్వాచార్యుల వారు ఆ విగ్రహానికి ఒక ఆలయం నిర్మించి ఎనిమిది మఠాలను
రెండేళ్ల పాటు ఒక్కో మఠం వారికి ఆలయ బాధ్యత అప్పగించేలా ఏర్పాటు చేశారు. ఆ రెండో ఆలయమే కర్ణాటక లోని ఉడిపి చిన్నికృష్ణుని ఆలయం.
అంటే ఆ రెండూ క్షేత్రాలు ఒకటి గురువాయుర్ ఐతే రెండో క్షేత్రం ఉడిపి.
#🙏హ్యాపీ కృష్ణాష్టమి🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #కృష్ణం వందే జగద్గురుం #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః