*_01/12/2025 - మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి_*
*మార్గశిర శుద్ధ ఏకాదశి "గీతాజయంతి". ఈ ఏకాదశిని "మోక్షద" ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది*.
*ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి “భగవద్గీత” ను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఈ ఏకాదశి "గీతాజయంతి" అని కూడా వ్యవహారిస్తారు*.
*_శ్లో𝕝𝕝 సర్వోపనిషదో గావో_*
*_దోగ్ధా గోపాలనందనఃl_*
*_పార్థో వత్సః సుధీర్భోక్తా_*
*_దుగ్ధం గీతామృతం మహత్ ||_*
*తా𝕝𝕝 సర్వోపనిషత్తుల సారమైన గోవు భగవద్గీత కాగా,* *గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాడు*.
*అనగా ఆ సారమును మనకు అందిచువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము (దూడ) కాగా, పండితులు, భక్తులు, పరమ భాగవతులు,ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగ నున్నారు*.
*సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత*.
*శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా, పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది*.
*శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథ ధ్వజంపై ఉన్న ఆంజనేయుడు*.
*సాక్షాత్తూ విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగిన వ్యాస మహాముని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు. అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు, లోకానికి అందించాడు*. *త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది*.
*భగవద్గీతలో 18* *అధ్యాయాలున్నట్లే*
*18 పేర్లున్నాయి.*
*_అవి…_*
*1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి*.
*ఎవరైతే*
*మోక్షస్థానాన్ని లక్ష్యంగా* *చేసుకున్నవారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.*
*ఎవరైతే*
*సంసార సాగరాన్ని* *దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు*.
*_శ్లో𝕝𝕝 భారతామృత సర్వస్వం_*
*_విష్ణువక్త్రాద్వినిస్సృతం_*
*_గీతా గంగోదకం పీత్వా_*
*_పునర్జన్మ న విద్యతే ||_*
*తా𝕝𝕝 గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండగా భారతమునందు ప్రవచించబడిన గీతామృతమును గురించి చెప్పనేల?*
*గంగానది విష్ణుపాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి*.
*అందువలన ఈ రెండూ ప్రతి మానవునకు పవిత్రములే*.
*గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి*.
*గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి*.
*నిష్కామ కర్మ, స్థితప్రజ్ఞత,* *స్వధర్మాచరణ, కర్తవ్య పాలన—*
*స్థూలంగా భగవానుడు కురుక్షేత్రం లో అర్జునునకు "భగవద్గీత" గా బోధించినది ఇదే. ప్రతి మానవుడు ఆచరించవలసిన ఉత్తమ సూత్రాలు ఇవి.*
*కష్టములకు కృంగిపోక, సుఖములు బడయునపుడు పొంగిపోక, నేను చేయు కర్మలకు నేను నిమ్మిత్త మాత్రుడను, సర్వం భగవదర్పణం అని భావించాలి. దీనివల్ల చిత్తశాంతి లభిస్తుంది. ఇదే స్థితప్రజ్ఞత అంటే*.
*గుణరహితమైనను స్వధర్మమునే ఆచరించవలెను*.
*పరధర్మమును ఆశ్రయించరాదు.*
*అని భగవద్గీత చెప్తుంది*.
*సమాజంలో ఎవరికి నిర్దేశించిన కర్మలు వారు నిష్టతో చెయాలి. ధర్మ మార్గంలో చిత్తశుధ్ధితో చేసే కర్మలు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. నిర్వర్తించే కర్మల యొక్క ఫలితాలను ఆశించకుండా, కేవలం నిమిత్తమాత్రుడనని తలిచి చేసే కర్మలు చిత్తశాంతిని కలిగిస్తాయి. ఫలితం ఆశించనప్పుడు ఆశాభంగం కలిగే అవకాశమే ఉండదు. ఇదే నిష్కామ కర్మ అంటే. దీనివల్ల వ్యక్తులు, సమాజం, పూర్తిస్థాయిలో కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతారు.*
*_శ్లో𝕝𝕝 మలినే మోచనం పుంసాం_*
*<జలస్నానం దినే దినేl_*
*_సకృద్_* *_గీతామృతస్నానం_*
*_సంసారమలనాశనమ్ ||_*
*తా𝕝𝕝 ప్రతిదినము చేసే స్నానము వలన దేహముపైని మురికిని శుభ్రపరచుకోవచ్చును.*
*కానీ పవిత్రమైన భగవద్గీత అనెడి గంగాజలమున స్నానము చేసినవాడు సంసారమాలిన్యము నుండి సంపూర్ణంగా ముక్తి నొందుచున్నాడు. అని గీతామహాత్మ్యము తెలిపినది*.
*స్నానం చెయ్యడం వల్ల శరీరంపైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది*.
*విజ్ఞులు, బుధజనులు పెద్దలు ఏది చేస్తే అందరూ దానినే పాటిస్తారు*. *అందుకే మానవుడు ఎప్పుడూ ఆదర్శప్రాయమైన సత్కర్మలనే ఆచరించాలి.*
*ఇవన్నీ పాటిస్తే జీవితం సుఖమయం అవుతుంది. జీవితం ఆదర్శప్రాయం అవుతుంది. ఒడిదుడుకులు లెకుండా ప్రశాంతమైన జీవన గమనం సాధ్యం అవుతుంది. అరిషడ్వర్గాలను జయించే శక్తి లభిస్తుంది. అరిషడ్వర్గాలను జయిస్తే, చక్కని జీవన విధానం సొంతం అవుతుంది. భగవానుడు తన భక్తుల నుండి ఆశించినది ఇదే*.
*_శ్లో𝕝𝕝 గీతా సుగీతా కర్తవ్యా_*
*_కిం అన్యైః శాస్త్ర విస్తరైఃl_*
*_యా స్వయం పద్మనాభస్య_*
*_ముఖపద్మాద్ వినిర్గతాll_*
*తా𝕝𝕝 భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున, మానవులు ఈ ఒక్కదానిని పఠించి, శ్రవణ, మనన, స్మరణముల ద్వారా సాధన చేసిన చాలును. ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుట వలన వేదవాజ్ఞ్మయమును పఠింపలేరు. వారికి గీతగ్రంథ పారాయణమే ముక్తినొసగును.*
*"గీతా” శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను” అని భగవానుడు అర్జునుడితో చెప్పినదాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది.*
*ఇటువంటి అద్భుతమైన* *మహాత్మ్యం కలది*
*"శ్రీ మద్భగవద్గీత". ఈ గీతా జయంతి నాడు శ్రీ కృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం*
*_గీతా జయంతి శుభాకాంక్షలు._* #మన సంప్రదాయాలు సమాచారం


![మన సంప్రదాయాలు సమాచారం - Ilesll మార్డశిరశుద్థ ఏకాదశీ-గీతాజయన్తీI6l]` న్న ~K W BHACATN Ilesll మార్డశిరశుద్థ ఏకాదశీ-గీతాజయన్తీI6l]` న్న ~K W BHACATN - ShareChat మన సంప్రదాయాలు సమాచారం - Ilesll మార్డశిరశుద్థ ఏకాదశీ-గీతాజయన్తీI6l]` న్న ~K W BHACATN Ilesll మార్డశిరశుద్థ ఏకాదశీ-గీతాజయన్తీI6l]` న్న ~K W BHACATN - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_909897_13126c6c_1764504908051_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=051_sc.jpg)