ShareChat
click to see wallet page
search
#😇My Status #ఛత్రపతి శివాజీ మహరాజ్ #ఛత్రపతి శివాజీ కోడలు తారబాయ్ భోంసలే *ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనుక ఉన్న వారికి దుమ్ము తప్ప గుర్రం కనబడేది కాదట.* *కరవాలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్లగింజలు ఆవిడ ఒంటిని తాకలేకపోయేవట.* *నేటికీ మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటల్లో సజీవంగా ఉన్నారు.* *ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోంస్లే భార్య.. తారాబాయి భోస్లే* *శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబ్ క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహరాజ్ చిన్న కొడుకు రాజారాం రాయ్ ఘడ్ కోట నుంచి నేటి తమిళనాడు జింగీ కోటకు వలస వెళ్లారు.* *అక్కడ నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు.* *దురదృష్టవశాత్తూ ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు. అప్పటికి మహారాణి తారాబాయి భోంస్లే వయసు కేవలం 25 ఏళ్ళు.* *ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్ ఘడ్ కు చేరుకొని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలన్నీ తిరిగి రాబట్టారు.* *ఆవిడ ప్రతి కోటనూ తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా* *మాల్వాప్రాంతాన్ని(ఉజ్జయిన్..బుర్హాంపూర్..సిరోంజీ..ముంద్రా) తన అధీనంలోకి తెచ్చుకున్నారు.* *ఒక విధవ ఇద్దరు చిన్నపిల్లలతో తననేమి గెలవగలదని మదంతో తారాభాయ్ మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని ఆలంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టి కిందపడేసిన సివంగి మహారాణి తారాబాయి.* *బతుకుజీవుడా అని పారిపోయి తిరిగి తన జీవితకాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు పిరికి ఆలంగీర్.* *తన బావ శంభాజీ..భర్త రాజారాం ల మరణంతో నీరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలచి కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి 27 ఏళ్ళు పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అవిచ్చన్నంగా ఏలినవీరా నారి తార బాయి* *'వారియర్ క్వీన్'..* *భారత్ లో ఒక రాణి ఝాన్సీ..* ఝల్కరి లక్ష్మి బాయి, రాణి చెన్నమ్మ, *కాకతీ రుద్రమ్మ..చౌతా అబ్బక్క ల సరసన చేర్చదగ్గ వీరవనిత మహారాణి తారాబాయి.*🙏
😇My Status - ShareChat