#🔹కాంగ్రెస్ #🗞పాలిటిక్స్ టుడే *భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు సూచన..*
*మొంథ తుఫాన్ ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి, అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు..*
ఇటీవల ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులు మరియు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు..
పాలకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో ప్రజల భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా తక్కువ ప్రాంతాలు, చెరువులు, వాగులు, డ్రెయిన్లు నిండిపోవడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు..
ప్రజల ప్రాణాలు అత్యంత విలువైనవి. కాబట్టి అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు. విద్యుత్ తీగలు తెగిపోయిన చోట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను నీటి ప్రదేశాలకు వెళ్లనీయకూడదు, అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ప్రజలను హెచ్చరించారు..
అలాగే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామపంచాయితీ మరియు ఇర్రిగేషన్ విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, వర్షాల ప్రభావంతో ఎక్కడైనా చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే స్పందించి పరిష్కరించాలి అని సూచించారు..
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. నేను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నాను. ఎక్కడైనా అత్యవసర సహాయం అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు లేదా అధికారులను తక్షణమే సంప్రదించండి, అని ఎమ్మెల్యే గారు తెలిపారు..
మొత్తం మీద, వర్షాల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అధికారులు పహారా వ్యవస్థను బలోపేతం చేయాలని మరియు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు స్పష్టంగా సూచించారు..

