*విజయవాడ- కనకదుర్గమ్మ*
*-రెండోవ రోజు అలంకారం..*
*శ్రీ గాయత్రి దేవిగా దర్శనం...*
శరన్నవరాత్రి మహోత్సవములలో రెండవ రోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. ||
శ్రీ ప్రార్థనా శ్లోకం
"ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్ |
* గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హసైర్వహంతీభజే ||
"సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విద్రుమ, హేమ నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి.
* ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది.
= సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధంవుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి.
* గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడంవలన సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.....స్వస్తీ..🙏🏻 #🔱శక్తి పీఠాలు🕉️ #🎉నవరాత్రి స్టేటస్🎊
00:53

