ShareChat
click to see wallet page
search
#🗞️నవంబర్ 30th ముఖ్యాంశాలు💬 ఆలయానికి నిధుల మంజూరుపై మంత్రికి నేతల ప్రశంస కోటబొమ్మాళి, నవంబర్ 30: టెక్కలి నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంలో చొరవ చూపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి కూటమి నేతలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రావివలస ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయం.. ఈ రెండు దేవాలయాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించే ప్రక్రియలో మంత్రి చూపిన చొరవను నేతలు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల ప్రభుత్వం నిధుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు తమకు ఎంతో ఆనందం కలిగించాయని నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన నాయకులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మంత్రి చూపుతున్న నిబద్ధత ప్రజాసేవ పట్ల ఆయనకున్న కృతనిశ్చయానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మంత్రి అచ్చెన్నాయుడు కి శాలువా కప్పి సత్కరించారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🌨️వాతావరణ అప్‌డేట్స్
🗞️నవంబర్ 30th ముఖ్యాంశాలు💬 - ShareChat