#పసుపు వినాయకుడు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #వినాయక వైభవం 🕉️🔱🕉️ గణపతి స్వరూపాలు / షోడశ గణపతులు 🙏 #పసుపు వినాయకుడు / పసుపు గణపతి 🙏
*పసుపు వినాయకుడు*
మన దేవతలందరిలోనూ గణపతిని మాత్రమే మహాగణపతి అని పిలుస్తాం. మహాగణపతి అంటే గొప్ప గణపతి, విశేషమైన గణపతి అని అర్థం. ప్రతి సంవత్సరం మనం పూజించే గణపతికి సైతం పూజనీయుడైన గణపతియే మహాగణపతి. ఆయనను మనం పసుపు ముద్దగా రూపొందించి పూజిస్తాం.
గణం అంటే ఒక సమూహం. గణనాయకులందరికీ నాయకుడే గణపతి వినాయక చతుర్థినాడు. మనం వరసిద్ది వినాయకునికి పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభువైన వాడు మహాగణపతి. ఆయనకంటే అధికులు ఎవ్వరూ లేరు. ఆ మహాగణపతినే మనం పసుపు విఘ్నేశ్వరునిగా పూజిస్తాం. శివుడు మహాగణపతిని పూజించాడు. ఆయన అనుగ్రహంతోనే త్రిపుర దహనం చేశాడు. ఆనాడు గణపతిని అర్చించకపోతే శివుని ప్రయత్నాలు సైతం వ్యర్థమై పోయేవి. శ్రీహరి వామనావతారం దాల్చినప్పుడు గణపతిని పూజించాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మసైతం ఆయనను ధ్యానించాడు.. దాంతో ఆటంకాలు తొలగి సృష్టి నిలబడింది. మహిషాసుర సంహారానికి ముందు జగదంబ సైతం గణపతిని ధ్యానించింది. మునిజనం మొదట తపస్సు ద్వారా అష్టసిద్ధులు పొందుతారు. వాటి ఆకరణలో పడవారెవ్వరూ మోక్షాన్ని పొందలేరు. వాటి ప్రదర్శనలో దిగజారిపోతారు. అప్పుడు మహాగణపతిని ధ్యానిస్తే ఆటంకాలు తొలిగి ముక్తిని పొందగలుగుతారు. ఆటంకాలను పరిహరించేది గణపతియే.
అసలు దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మ, ఆయన్నే మనం వేరువేరుగా రూపాలు కల్పించుకుని వరసిద్ధి గణపతిగా, విద్యాగణపతిగా, పతిగా, లక్ష్మీగణపతిగా ఇలా వేరువేరుగా పూజలు చేస్తున్నాం.
త్రిమూర్తులంటున్నాం. త్రిశక్తులంటున్నాం వీరంతా ఆయా కార్య సిద్ధుల కోసం కల్పించబడ వారే. మాఘంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారిగా, కార్తికంలో శివకేశవులుగా, భాద్రపదంలో గణపతిగా ఆయనొక్కడే వేర్వేరు ఉపాసనలు పొందుతున్నాడు. ఇవన్నీ సగుణ రూపాలు. అంటే కన్నూ ముక్కు వంటి అవయవాలు ధరించిన మూర్తులు. అయినా ఉన్నది ఒక్కటే. దాన్నే మనం ఈ మాయా జగత్తులో అనేకంగా చూస్తున్నాం. నిజానికి అనేకం లేనే లేవు. అద్దాల గదిలో నిలబడితే మనం అనేక రూపాలతో కనబడతాం. కానీ మనం ఒక్కరమే అవన్నీ మన ప్రతిబింబాలేనని మనకు తెలుసు. వాటికి బొట్టు పెట్టాలంటే అన్నింటికీ పెట్టనవసరం మూర్తు లందరికీ పెట్టినట్టు అవుతుంది. కదా! వినాయకుణి పూజించడం కూడా అలాంటిదే.
ఏనుగు తల, పెద్దపొట్ట, ఎలుక వాహనం, పాలవెల్లి ఇవన్నీ మనం కల్పించుకుంటున్నాం. అలాంటి కల్పనలో కూడా మనం చిత్తశుద్ధితో పూజిస్తే ఇవన్నీ ఆ మూల స్వరూపానికి చెందుతాయి. అలా అని ఈ గణపతుల పూజే ప్రధానం అని భావించ కూడదు. మనం నిరుణ గణపతినే అంటే పరబ్రహ్మనే తొలిసారిగా అర్చించాలి. తల్లికి భోజనం పెట్టకుండా ఊరంతా సంతర్పణ చేసినా ఎలా ఫలితం లేదో అలానే నిరుణారాధన లేకుండా సగుణారాధన చేసినా ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. అయితే ఎలా...? అందుకే ముందు పసుపు గణపతిని అర్చించడం ఆచారంగా చేశారు పెద్దలు. పసుపును ఒక గుండ్రని ముద్దగా చేసి ఏ పూజకైనా మనం మొట్టమొదటగా అర్చిస్తున్నాం. ఆ ముద్దకు అవయవాలుండవు. ఏనుగుతల ఉండదు. ఎలుక ఉండదు. అంతేకాదు నైవేద్యం కూడా. సరైన రూపం లేని బెల్లం ముక్కనే పెడతాం. ఇంట్లో ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఈ పసుపు గణపతి పూజ చేయాల్సిందే. శుభకార్యాలకు మీదుకట్టడం కూడా మహాగణపతిని ఉద్దేశించి చేసేదే.
ఆఖరుకి వినాయక చవితి నాడు ఎంత ఖర్చుపెట్టి పెద్ద గణపతుల్ని ప్రతిష్ఠించినా ఈ హరిద్రాగణపతే అందరికీ మూలకారకుడు. ఆ నిర్గుణతత్త్వాన్నే వేదం కీర్తించింది. అన్ని గణాలకు ఆయనే ప్రధానం. కవులకే కవీశ్వరుడు స్వామి. ఆ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు. అందరు దేవతలకు జ్యేష్ఠుడు. మహాగణపతియే ప్రధాన దైవం. ఆయన వల్లే వేదాలు వచ్చాయి. కనుక ఆయనే వేదగణాలకూ ప్రభువు. ఈ తత్త్వం తెలుసుకోగలగడమే ఒక అదృష్టం.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*


