*గౌరవనీయులు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు యొక్క పిలుపుమేరకు, గౌరవ కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ గారిని ఆదర్శంగా తీసుకుని, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా... కృష్ణాజిల్లా, పమిడిముక్కల మండలం, ఐనపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తమ్మన వేణుగోపాలరావు గారు పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునే నిమిత్తం, అడ్మిషన్ల కోసం క్యాంపెయిన్ నిర్వహించే సమయంలో, రోజంతా సైకిల్ పై తిరుగుతూ, ఊరంతా ప్రచారం చేస్తూ, ప్రతి ఇంటికీ తిరుగుతూ, బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అందరికీ తెలియజేస్తూ, అడ్మిషన్లు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం తీసుకున్న అనేక మంచి నిర్ణయాల వల్ల, విద్యా విధానంలో తీసుకువచ్చిన అనేక మంచి మార్పుల వల్ల, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారని, చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై సానుకూల దృక్పథంతో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడంతో, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ముందుకు వస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ తమ్మన వేణుగోపాలరావు గారు తెలియజేశారు. గత వారం పది రోజుల నుండి ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చుట్టుపక్కల పరిసర గ్రామాలైన కూడేరు, ఐలూరు, ఐనపూరు, అప్పారావుపేట తదితర గ్రామాలలో విస్తృతంగా పర్యటించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను చేర్చుకోవడమే కాకుండా, గత కొంతకాలం నుండి ప్రైవేటు పాఠశాలకు వెళుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు కూడా వెళ్లి, వారికి కూడా ప్రభుత్వ పాఠశాల యొక్క ఆవశ్యకతను గురించి వివరించి, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగుతున్న అనేక మంచి కార్యక్రమాలను, అలాగే అనేక మంచి సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించి, వారిని కూడా ఒప్పించి, వారి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా వివరించి, వారి దగ్గర కూడా అడ్మిషన్లను సేకరించి, బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా కృషి చేస్తున్నారు. గౌరవ ఆర్జేడీ మేడం గారు శ్రీమతి నాగమణి గారు మరియు కృష్ణాజిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, అధికారుల అన్ని సలహాలను సూచనలను పాటిస్తూ, ప్రతిరోజు క్యాంపెయిన్ నిర్వహించి, పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచే విధంగా ముందుకు సాగుతున్నారు. కృష్ణాజిల్లా గౌరవ డీఈఓ శ్రీ యు.వి. సుబ్బారావు గారు, ఉయ్యూరు డివిజన్ గౌరవ డివైఈవో శ్రీమతి ఐ.పద్మారాణి గారు, పమిడిముక్కల మండల గౌరవ ఎంఈఓ శ్రీ ఎస్.శ్రీనివాస్ గారు ఇచ్చేటటువంటి అన్ని సలహాలు మరియు సూచనలు పాటిస్తూ, వారందరి సహకారంతో పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు గారు తెలియజేశారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్ మరియు మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులతో పాటు, పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ శ్రీమతి దూడల.శివనాగభవాని గారు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, సిఆర్పి శ్రీహరి గారు, గ్రామ సచివాలయ సిబ్బంది, పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు కూడా "క్యాంపెయిన్" లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*
*ఈరోజు ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా ఐనపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసర గ్రామాలలో మరియు ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ శ్రీమతి దూడల.శివనాగభవాని, పూర్వ విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి విస్తృతంగా పర్యటించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించి అడ్మిషన్లు చేసుకోవడం జరిగింది. విద్యార్థులకు ప్రభుత్వము వారు అందించే సంక్షేమ పథకాలు మరియు నాణ్యమైన విద్య మొదలగు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది.
(1) ప్రభుత్వం ఉచిత టెక్స్ట్ పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, యూనిఫామ్ లు, షూస్, బెల్ట్స్, బ్యాగ్స్ మొదలగునవి అన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.
(2) తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది. అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు ఈ పథకం ద్వారా తల్లి యొక్క బ్యాంక్ పాస్ పుస్తకంలో ఒకేసారి మొత్తం అమౌంట్ జమ చేయడం జరుగుతుంది.
(3) శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి విలువలతో కూడిన ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడం జరుగుతుంది.
(4) ప్రతి పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరుగుతుంది.
(5) బోధనకు అనుకూలమైన పారిశుద్ధ్య వాతావరణాన్ని, మనసుకు ప్రశాంతతను ఇచ్చే మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణాన్ని పాఠశాల పరిసరాలలో పాటించడం జరుగుతుంది.
(6) నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ద్వారా ఎంపిక చేయబడిన, అధిక విద్యా డిగ్రీలు మరియు ఎంతో అనుభవం గడించిన ఉపాధ్యాయులతో బోధన చేయించడం జరుగుతుంది.
(7) ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నైతిక విలువలు మరియు విషయ అవగాహనతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది.
ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న మన ప్రభుత్వానికి అండగా నిలుద్దాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు మన వంతు చేయూతను అందిద్దాం.
💐🌹🌷💐🌹🌷💐🌹🌷💐🌹🌷 #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙏స్ఫూర్తి కవితలు #📝శ్రీ శ్రీ కవితలు📝 #📑దేశభక్తి కవితలు✍


